Showing posts with label తెలుగింటి రుచులు. Show all posts
Showing posts with label తెలుగింటి రుచులు. Show all posts

Monday, September 3, 2018

అప్పాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

రేపు   శ్రావణ  శుక్ర వారము .

వరలక్ష్మీ  వ్రతము.

అమ్మవారికి  అప్పాలు  చాలా ప్రీతికరమైనవని  దేవి గుడిలోని  పూజారి గారు  తెలియచేసారు .

రేపు  వరలక్ష్మీ  అమ్మ వారికి  ప్రత్యేకంగా  నివేదనకు  అప్పాలు తయారీ విధానము .

ప్రియమిత్రులందరికీ .

అమ్మ వారి  ప్రసాదము  అప్పాలు  తయారు  చేయు  విధానము .

కావలసినవి .

షుమారుగా  ఒక  కప్పు  కొలతగా  పెట్టుకోండి .

గోధుమ పిండి   ---   అరకప్పు

బియ్యపు  పిండి  ---  అర కప్పు

బెల్లం  తరిగిన   పొడి  --  ఒక  కప్పు

పచ్చి కొబ్బరి  తురుము ---  పావు  కప్పు    

యాలకుల పొడి  ---  అర  స్పూను 

నెయ్యి  ---  రెండు  స్పూన్లు

నూనె  ---  200  గ్రాములు

తయారీ  విధానము  .

ముందుగా   స్టౌ  మీద  బాండీ  పెట్టి తరిగిన   బెల్లం  పొడి  వేసి  బెల్లం పొడి  మునిగే  వరకు  నీళ్ళు  పోసి  బెల్లం   కరిగాక   నీళ్ళు  బాగా  తెర్లనివ్వాలి .

పాకం  రావక్కరలేదు.

గోధుమ  పిండి  మరియు  బియ్యపు  పిండి రెండూ  జల్లెడ  పోసుకుని  లేదా  రెండూ బాగా కలుపుకొని , తెర్లుతున్న  నీళ్ళలో  ముందు యాలకుల  పొడి వేసి , తర్వాత  ఈ  పిండి , కొబ్బరి తురుము  మరియు  రెండు స్పూన్లు   నెయ్యి  వేసి  బాగా  గరిటెతో  కలిపి   స్టౌ  వెంటనే   ఆపేయాలి.

కొద్ది  సేపు   తర్వాత  చేతికి  నెయ్యి  రాసుకొని  ఎడం  అర చేతిలోకి  కొద్దిగా   ఈ  మిశ్రమాన్ని  తీసుకొని   కుడి  చేతి  వేళ్ళతో  పాలకోవా  బిళ్ళలు  లాగా  చిన్న  చిన్న  అప్పాలు  మాదిరిగా   పిండి  అంతా  వత్తుకొని  వేరే  ప్లేటులో  పెట్టుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  వేరే  బాండి  పెట్టి  నూనె  అంతా  పోసి  నూనె  బాగా   కాగనివ్వాలి .

తర్వాత  షుమారు ఎనిమిది  పది  అప్పాలు  వేసి  ఎక్కువ   సేపు  ఉండనివ్వకుండా  వెంటనే  తీసెయ్యాలి .

ఎక్కువ   సేపు  ఉంటే  అప్పాలు  మాడి  పోతాయి.

ఇవి  కొబ్బరి  బూరెల్లా  కొంచెం   మెత్తగా   ఉంటాయి .

అప్పాలు  గట్టిగా   కావాలనుకునే  వాళ్ళు  ముప్పావు  కప్పు  బియ్యపు  పిండి  , పావు కప్పు  గోధుమ పిండి  వేసుకుని   చేసుకోవాలి .

అంతే  అమ్మ  వారి  ప్రసాదానికి  అప్పాలు  సిద్ధం.

కొంచెం   పెద్దవి  చేసుకుంటే  బూరెల్లా  టిఫిన్  గా  కూడా  బాగుంటాయి .

సంబంధిత రెసిపీ  మరియు ఫోటోలు  నా  స్వంతం .

అప్పాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

రేపు   శ్రావణ  శుక్ర వారము .

వరలక్ష్మీ  వ్రతము.

అమ్మవారికి  అప్పాలు  చాలా ప్రీతికరమైనవని  దేవి గుడిలోని  పూజారి గారు  తెలియచేసారు .

రేపు  వరలక్ష్మీ  అమ్మ వారికి  ప్రత్యేకంగా  నివేదనకు  అప్పాలు తయారీ విధానము .

ప్రియమిత్రులందరికీ .

అమ్మ వారి  ప్రసాదము  అప్పాలు  తయారు  చేయు  విధానము .

కావలసినవి .

షుమారుగా  ఒక  కప్పు  కొలతగా  పెట్టుకోండి .

గోధుమ పిండి   ---   అరకప్పు

బియ్యపు  పిండి  ---  అర కప్పు

బెల్లం  తరిగిన   పొడి  --  ఒక  కప్పు

పచ్చి కొబ్బరి  తురుము ---  పావు  కప్పు    

యాలకుల పొడి  ---  అర  స్పూను 

నెయ్యి  ---  రెండు  స్పూన్లు

నూనె  ---  200  గ్రాములు

తయారీ  విధానము  .

ముందుగా   స్టౌ  మీద  బాండీ  పెట్టి తరిగిన   బెల్లం  పొడి  వేసి  బెల్లం పొడి  మునిగే  వరకు  నీళ్ళు  పోసి  బెల్లం   కరిగాక   నీళ్ళు  బాగా  తెర్లనివ్వాలి .

పాకం  రావక్కరలేదు.

గోధుమ  పిండి  మరియు  బియ్యపు  పిండి రెండూ  జల్లెడ  పోసుకుని  లేదా  రెండూ బాగా కలుపుకొని , తెర్లుతున్న  నీళ్ళలో  ముందు యాలకుల  పొడి వేసి , తర్వాత  ఈ  పిండి , కొబ్బరి తురుము  మరియు  రెండు స్పూన్లు   నెయ్యి  వేసి  బాగా  గరిటెతో  కలిపి   స్టౌ  వెంటనే   ఆపేయాలి.

కొద్ది  సేపు   తర్వాత  చేతికి  నెయ్యి  రాసుకొని  ఎడం  అర చేతిలోకి  కొద్దిగా   ఈ  మిశ్రమాన్ని  తీసుకొని   కుడి  చేతి  వేళ్ళతో  పాలకోవా  బిళ్ళలు  లాగా  చిన్న  చిన్న  అప్పాలు  మాదిరిగా   పిండి  అంతా  వత్తుకొని  వేరే  ప్లేటులో  పెట్టుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  వేరే  బాండి  పెట్టి  నూనె  అంతా  పోసి  నూనె  బాగా   కాగనివ్వాలి .

తర్వాత  షుమారు ఎనిమిది  పది  అప్పాలు  వేసి  ఎక్కువ   సేపు  ఉండనివ్వకుండా  వెంటనే  తీసెయ్యాలి .

ఎక్కువ   సేపు  ఉంటే  అప్పాలు  మాడి  పోతాయి.

ఇవి  కొబ్బరి  బూరెల్లా  కొంచెం   మెత్తగా   ఉంటాయి .

అప్పాలు  గట్టిగా   కావాలనుకునే  వాళ్ళు  ముప్పావు  కప్పు  బియ్యపు  పిండి  , పావు కప్పు  గోధుమ పిండి  వేసుకుని   చేసుకోవాలి .

అంతే  అమ్మ  వారి  ప్రసాదానికి  అప్పాలు  సిద్ధం.

కొంచెం   పెద్దవి  చేసుకుంటే  బూరెల్లా  టిఫిన్  గా  కూడా  బాగుంటాయి .

సంబంధిత రెసిపీ  మరియు ఫోటోలు  నా  స్వంతం .

కరివేపాకుతో పులిహోర

ఆలూరుకృష్ణప్రసాదు .

కరివేపాకు తో పులిహోర .

కరివేపాకు  ఆరోగ్యానికి  చాలా మంచిది .

కంటి చూపు మెరుగుదలకు , అరుగుదలకు కరివేపాకు  ఏదో విధంగా ఆహారంలో వాడుకోవడం ఉత్తమం .

చాలా మంది  కూరల్లో , పులుసుల్లో  కరివేపాకు  వేసుకున్నా  భోజనము చేసే సమయంలో  కరివేపాకు  తీసి పారేస్తారు .

మనకు "  కూరల్లో కరివేపాకు లా తీసిపారేసాడురా "  అనే సామెత ఉండనే ఉంది కదా .

చాలామంది కరివేపాకు లోని సుగుణాలను  గుర్తించి  కరివేపాకు తో కారప్పొడి , కరివేపాకు  పచ్చడి  ఇలాచేసుకుంటూ ఉంటారు .

మేము  కరివేపాకుతో పులిహోర  చేసుకుంటే ఎలా ఉంటుందా అని  కొంచెం  వెరైటీ గా  ప్రయత్నించాము.

చాలా బాగా కుదిరింది.

అందువల్ల ఆ రెసిపీ మీకు తెలియచేస్తున్నాను.

కరివేపాకు తో పులిహోర .

కావలసినవి .

బియ్యం  --  షుమారు  175  గ్రాములు  లేదా  ఒక గ్లాసు .
చింతపండు  --  షుమారుగా  60 గ్రాములు .
పచ్చిమిర్చి  -- 10
పసుపు  ---  స్పూను
ఉప్పు  --  తగినంత
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు .
ఇంగువ --  పావు టీ స్పూను

పులిహోర లో వేయటానికి కరివేపాకు  పొడికి కావలసిన  పదార్ధములు .

ఎండుమిరపకాయలు  - 4
కరివేపాకు  --  ఒక కప్పున్నర
పచ్చిశనగపప్పు  -  రెండు  స్పూన్లు
చాయమినపప్పు  -  రెండు స్పూన్లు
వేరు శనగ గుళ్ళు -  రెండు స్పూన్లు 
నువ్వుపప్పు  - రెండు  స్పూన్లు
ఇంగువ  -  కొద్దిగా
ఉప్పు -  తగినంత
నూనె  --  మూడు స్పూన్లు

పులిహోర లో పోపునకు .

ఎండుమిరపకాయలు  - 8 
పచ్చిశనగపప్పు  - రెండు స్పూన్లు
చాయమినపప్పు  - రెండు స్పూన్లు
ఆవాలు --  స్పూను
ఇంగువ  --  కొద్దిగా
జీడిపప్పు  - పది బద్దలు
వేరు శనగపప్పు  -  మూడు స్పూన్లు 
కరివేపాకు  -- మూడు రెమ్మలు .

కరివేపాకు  పులిహోర  తయారీ విధానము .

ముందుగా ఒక గ్లాసు బియ్యము కడిగి , తగినన్ని  నీరు పోసి  స్టౌ మీద పెట్టుకుని  పొడి పొడిగా  వండుకోవాలి .

చింతపండు  పదిహేను నిముషాలు  గ్లాసు నీళ్ళలో నాన బెట్టుకుని  
చిక్కగా రసము తీసుకోవాలి .

ఇప్పుడు  పులిహోరలో వేయడానికి  పొడి  సిద్ధం చేసుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి  పొడికి కావలసిన పైన తెలిపిన నూనె వేసి నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , వేరుశనగ గుళ్ళు , నువ్వుపప్పు , కొద్దిగా  ఇంగువ  మరియు  కరివేపాకును  వేసి  ఎర్రగా  పోపు వేయించుకోవాలి .

పోపు చల్లారగానే మిక్సీ లో  మెత్తగా  పొడి చేసుకోవాలి .

వేరే ప్లేటులోనికి తీసుకోవాలి .

తిరిగి  స్టౌ  మీద బాండీ పెట్టుకుని  పోపుకు తెలిపిన నూనె మొత్తము  వేసి నూనె బాగా కాగగానే  ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి , కరివేపాకు , వేరుశనగ గుళ్ళు  మరియు జీడిపప్పు వేసి పోపు వేయించుకోవాలి .

ఆ పోపులో  చింతపండు  రసము , తగినంత  ఉప్పు మరియు పసుపు వేసి అయిదు నిముషాలు బాగా ఉడకనివ్వాలి .

తర్వాత ఉడికిన  అన్నం పోపులో  వేసి గరిటెతో బాగా కలుపు కోవాలి .

తర్వాత ముందుగా  సిద్ధం చేసుకున్న కరివేపాకు పొడి కూడా అందులో వేసుకుని స్టౌ సిమ్ లో పెట్టుకుని మూడు నిముషాలు  మగ్గనిచ్చి  దింపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే కరివేపాకు  పులిహోర  అల్పాహారానికి , దేవుని నివేదనకు  మరియు సర్వింగ్  కు  సిద్ధం.

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం.

Wednesday, July 4, 2018

బెల్లం పాకం గారెలు

ఆలూరుకృష్ణప్రసాదు .

బెల్లం పాకం గారెలు.

తయారీ విధానము .

మినపగుళ్ళు  --  200 గ్రాములు.
బెల్లం  --  200 గ్రాములు
ఏలకులపొడి  --  స్పూను
నూనె  --  500  గ్రాములు.

తయారీ విధానము .

మినపగుళ్ళు  ఒక గిన్నెలో  పోసుకుని  ఒకసారి  కడిగి  సరిపడా నీళ్ళు పోసుకుని  ఆరు గంటలు  సేపు నానబెట్టుకోవాలి .

తర్వాత  నీళ్ళు వడగట్టి  గ్రైండర్  లో  వేసుకుని  కొద్దిగా  నీళ్ళు పోసుకుని  గారెల పిండిలా  గట్టిగా   రుబ్బుకోవాలి .

ఆ తర్వాత  వేరే గిన్నెలోకి  తీసుకుని  చిటికెడు   ఉప్పు  వేసుకుని  గరిటెతో  బాగా  కలుపుకోవాలి .

బెల్లం గడ్డలను మెత్తగా  పొడిగా  చేసుకోవాలి .

మరల స్టౌ  మీద  గిన్నె పెట్టి  బెల్లం  పొడి  వేసి , ఒక గ్లాసు  నీళ్ళు పోసి  పాకం పట్టుకోవాలి .

గరిటతో  పాకాన్ని  తిప్పుతూ ఉండాలి .

పాకం మరీ  గట్టి పాకం కాకుండా  చేతి వేళ్ళకు  అంటుకునేలా  పాకం రానిచ్చి , యాలకుల పొడి  వేసి   దింపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము  నూనె  పోసి నూనె  పొగలు  వచ్చే విధముగా  బాగా  కాగనివ్వాలి .

రుబ్బి సిద్ధంగా  ఉంచుకున్న  పిండిని  అరిటాకు  మీద  తడి చేతితో  గారెలు  మాదిరిగా వేసుకుని, రెండు వైపులా  బంగారు  రంగు  వచ్చేలా  వేయించుకోవాలి .

అలా  వేగిన  గారెలు  వెంటనే  బెల్లం  పాకంలో  వేసి  మూడు నాలుగు గారెలు  పాకం  పీల్చుకోగానే  విడిగా  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  జాంగ్రీల మాదిరిగా  పాకం పీల్చుకున్న  బెల్లం   పాకం గారెలు  సర్వింగ్  కు సిద్ధం .

గోదావరి  జిల్లాలలో  చాలా చోట్ల బెల్లం పాకం గారెలు తయారు చేస్తారు.

కొంతమంది  బెల్లం బదులు  పంచదారతో కూడా ఇదే విధానములో పాకం గారెలు  తయారు చేస్తారు .

అప్పుడు  ఓ  150 గ్రాముల పంచదార తీసుకుని
పై విధముగా  కూడా  చేసుకోవచ్చును .

సంబంధిత రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం .

సాంబార్ రైస్

ఆలూరుకృష్ణప్రసాదు .

సాంబార్  రైస్ .

వేసవికాలం .
పిల్లలకు శలవులు .అక్కడకు వెడదాం.ఇక్కడకు తీసుకు వెళ్ళండి అని గొడవ చేస్తుంటారు .

అలాటి సందర్భాలలో

దూరపు  ప్రయాణాలు , చిన్న పిక్నిక్ లకు చేయవలసి  వచ్చినప్పుడు   ఇలా  సాంబార్  రైస్  మరియు  దద్ధ్యోజనం   చేసుకొని    వెడితే   నలుగురు   మీద  ఖర్చులు  కలిసి  వస్తాయి  మరియు  ఆరోగ్యానికి   మంచిది .

అలాగే   నలుగురు  families  సరదాగా   ఎక్కడికైనా  వెళ్ళేటప్పుడు  కూడా  ఈ  సాంబార్  రైస్  తయారు చేసుకుని   వెంట  తీసుకొని   వెళ్ళవచ్చు  .

మనం  సాంబారు  పొడి  తయారు  చేసుకొని   సిద్ధంగా   ఉంచుకుంటే    సులువుగా   సాంబార్  రైస్  తయారీ  అయిపోతుంది .

సాంబారు  పొడి  తయారీ  ---

ఎండుమిర్చి  ---  15
పచ్చిశనగపప్పు   --   అయిదు  స్పూన్లు
ఎండు కొబ్బరి --  అర చిప్ప. చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
ధనియాలు  -- నాలుగు  స్పూన్లు
మిరియాలు  --  ఒక  స్పూను
ఇంగువ   ---  పావు స్పూను లో సగం.
బియ్యం  --  రెండు  స్పూన్లు

పై  వన్నీ  బాండీలో  నూనె  లేకుండా  వేయించుకొని  చల్లారగానే  మెత్తగా   మిక్సీ  వేసుకోవాలి .

ఈ  పొడిని  ఒక  సీసాలో  భద్ర పరుచుకోవాలి .

ఈ  పొడి  మనం  విడిగా   సాంబారు  పెట్టుకోవడానికి  కూడా  ఓ  ఐదు  ఆరు సార్లకు  వస్తుంది .

సాంబార్  రైస్  తయారీ  విధానము

కావలసినవి .

ఉల్లిపాయలు  ---  మూడు
సొరకాయ ముక్క --  ఒకటి
వంకాయలు  --  నాలుగు లేదా
బెండకాయలు --  పది

ఈ కూరలన్నీ  ముక్కలుగా  తరుగుకొని  వేరుగా పెట్టుకోవాలి .

పచ్చి  మిర్చి  ఒక  అయిదు  నిలువుగా   తరగాలి.

కరివేపాకు  ఒక మూడు  రెమ్మలు , కొత్తిమీర  ఒక చిన్న  కట్ట  సిద్ధంగా  ఉంచుకోవాలి .

పెద్ద  నిమ్మకాయంత  చింతపండు   పదిహేను  నిముషాలు  ఒక  గ్లాసున్నర నీళ్ళలో   నానబెట్టి  రసం  తీసుకోవాలి .

ఒక  గ్లాసు బియ్యం తగినన్ని నీళ్ళు పోసి  విడిగా  స్టౌ  మీద  పెట్టి కొంచెం  పొడి పొడిగా   వండుకోవాలి.

అలాగే ఒక కప్పు కందిపప్పు  తగినన్ని  నీళ్ళు పోసి కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి .

అన్నం ఒక గిన్నెలో , పప్పు ఒక గిన్నెలో  పెట్టుకుని  రెండూ కలిపి కుక్కర్ లో పెట్టుకోవచ్చు .

సమయం కలిసి వస్తుంది .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండి  పెట్టి  నాలుగు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   మూడు ఎండుమిరపకాయలు   ముక్కలుగా చేసి ,  పావు  స్పూను మెంతులు , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ ,
కరివేపాకు మరియు  పచ్చిమిర్చి  ముక్కలు   వేసి పోపు  వేయించి  అందులో  తరిగిన అన్ని కూరల ముక్కలు మరియు ఉల్లిపాయల  ముక్కలు , కొద్దిగా  పసుపు , స్పూను  కారం , మరియు తగినంత   ఉప్పు వేసి  మూతపెట్టి     పది నిముషాలు   ముక్కలన్నీ మెత్తగా  మగ్గ నివ్వాలి .

ఆ తర్వాత  అందులో  చింతపండు  రసం  మరో రెండు గ్లాసులు నీళ్ళు  పోసి  బాగా  తెర్లనివ్వాలి .

ఆ తర్వాత ఉడికించిన పప్పు కూడా కలుపుకోవాలి .

తర్వాత  మూడు  స్పూన్లు   సాంబారు  పొడి  వెయ్యాలి .

అయిదు  నిముషాలు  తెర్లిన  తరువాత  దింపి  కొత్తిమీర   వేసుకోవాలి .

ఇంతవరకు  సాంబార్  సిద్ధమైంది .

ఇప్పుడు  ఉడికిన అన్నం  బేసిన్  లోకి  తీసుకొని  చల్లార పెట్టుకోవాలి .

వేడి మీద కలిపితే వాసన రావచ్చును .

చల్లారిన అన్నంలో సాంబారు , నాలుగైదు స్పూన్లు   నెయ్యి  వేసి  అన్నం  కలుపుకోవాలి .

లేదా  తెర్లుతున్న  సాంబారు  లో  పట్టిన  వరకు  ఉడికిన  అన్నం  వేసి  గరిటతో  బాగా కలిపి  మరో  అయిదు  నిముషాలు  స్టౌ  మీద  ఉంచి  దింపే ముందు  నెయ్యి  వేసి  గరిటతో  బాగా  కలిపి  దింపు కొని విడిగా చల్లార బెట్టుకోవాలి .

అప్పటికప్పుడు తినాలనుకుంటే  ఐతే  వేడిగా  తినవచ్చు .

బాక్స్ లో  సర్దుకోవాలనుకునే  పక్షంలో  చల్లారాక  పెట్టుకోండి .

వేడి  మీద  పెడితే   వాసన వచ్చి నిల్వ  ఉండక పోవచ్చు .

ఈ సాంబార్ రైస్ తో పాటుగా అప్పడాలు కూడా వేయించుకుని బాక్స్ లో సర్దుకుని  తీసుకొని  వెళ్ళి తింటే ఆ రుచే వేరు .

సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

Thursday, March 1, 2018

తెలగపిండి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

తెలగ పిండి అంటే  నువ్వులు గానుగ లో  నూనె  ఆడాక  వచ్చే  పిండిని  తెలగ పిండి  అంటారు .

గోదావరి  జిల్లాలలో   దాదాపుగా  ప్రతి ఇంటిలో   ఈ తెలగ పిండితో  కూర  చేసుకుంటారు .

నువ్వులు  శుభ్రం  చేసి  గానుగలో  నూనె ఆడితే , తెలగపిండిలో  ఇసుక తగలదు .

అందువలన  శుభ్రం   చేసి  నూనె  ఆడిన   గానుగల్లో  తెలగ పిండి   తెచ్చుకుంటే  కూర  చాలా రుచిగా  ఉంటుంది .

మరి ఈ తెలగ పిండి కూర  ఏ విధముగా  తయారు చేస్తారో  తెలుసుకుందాం .

తెలగపిండి  కూర .

నువ్వుల నూనె తీసాక వచ్చిన నువ్వుల పొట్టును తెలగపిండి అంటారు.

ఇందులో ఫైబర్  అధికంగా ఉంటుంది.

సాధారణంగా  గానుగ లో నూనె ఆడిన కొట్లలో ఇది దొరుకుతుంది.

బాలింతలకు  పాలు బాగా పడతాయని ఈ కూరను  బాలింతలతో బాగా తినిపిస్తారు.

పత్యానికి, ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.

ఈ కూర తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాము.

1కప్పు తెలగపిండి కి 1.5 కప్పు నీరు తీసుకోవాలి.

నీటిలో చిటికెడు మెంతులు, చిన్న బెల్లం ముక్క, అర చెంచా కారం, తగినంత ఉప్పు వేసి మరగనివ్వాలి.

మరుగుతున్న నీటిలో తెలగపిండి వేసి, బాగా కలిపి, సిమ్ లో మూత పెట్టి, పిండి విరవిరలాడుతూ విడిపోయే దాకా ఉడకనివ్వాలి.

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టుకుని మూడు చెంచాల నూనె వేసి, అందులో అర స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, స్పూనున్నర మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి ముక్కలు గా చేసుకుని  కాగిన నూనెలో వేసి, పోపు  వేగాక ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు,  మూడు రెమ్మలు కరివేపాకు వేసి, వేగనిచ్చి, అందులో ఉడికిన తెలగపిండి వేసి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి.

చక్కని సువాసనలతో తెలగపిండి కూర సిద్ధం.

వెల్లుల్లి  వాడని వారు మరియు ఇష్టపడని  వారు  వెల్లుల్లి  వేయకుండా  చేసుకొనవచ్చును .

అంతే ఎంతో రుచిగా  ఉండే  తెలగపిండి  కూర సర్వింగ్  కు సిద్ధం.

పూర్ణం బూరెలు

ఆలూరుకృష్ణప్రసాదు .

పూర్ణం  బూరెలు .

శుభ సందర్భాలలో  తప్పని సరిగా  ప్రతి  ఒక్క కుటుంబాలలో  చేసుకునే  పిండి వంట పూర్ణం బూరెలు .

గోదావరి జిల్లాలలో  చాలామంది  పెసర పూర్ణం  బూరెలు  చేసుకుంటారు .

మరి మనం  ఈరోజు పచ్చిశనగపప్పు  తో పూర్ణం బూరెలు  తయారీ విధానము గురించి  తెలుసుకుందాం.

చాలా మంది  పూర్ణం బూరెలు చేయాలంటే  మాకు  భయం. మేం చేసిన ప్రతిసారీ  బూరెలు నూనెలో వేయగానే   చీదతాయి . ( విడిపోతాయి ) అందుకే  ప్రయత్నించం  అంటారు .

మేం ఎప్పుడు  చేసినా బూరెలు మాకు  ఎప్పుడూ  అలా   చీదవు .

కారణం లోపల ఉంచే పూర్ణం తయారీ  గట్టిగా  ఉండాలి .

పలచగా  ఉండకూడదు.

పూర్ణం పిండి  పలచగా  తయారు చేసుకుంటే  పూర్ణం బూరెలు నూనెలో వేయగానే చీదతాయి .

కాబట్టి లోపల పెట్టుకునే పూర్ణం  గట్టిగా  తయారు చేసుకోవాలి .

అలాగే  పైన  పెట్టుకునే  తోపు.

తోపు అంటే  తయారు చేసుకున్న పూర్ణం  చిన్న చిన్న  ఉండలుగా  చేసుకుని , తోపు  పిండిలో  ముంచి  వేసుకునేది .

తోపు  బాగా లేకపోతే  బూరె  నూనెలో వేగాక తింటే  మందంగా  ఉండి  సాగుతుంది .

తోపు వేగాక పల్చగా  ఉండాలి . తింటుంటే  కరకర లాడాలి .

ఈ తోపు  రెండు  రకములుగా  తయారు చేస్తారు .

మొదటి విధానము  ఒక గ్లాసు  మినపగుళ్ళు  మరియు  నాలుగు  గ్లాసుల బియ్యంతో  కలిపి  మెత్తగా  పిండి  మర పట్టించుకోవాలి .

ఇలా  మర పట్టించుకున్న పిండిలో  తోపుకు కావలసినంత పిండిని ఒక గిన్నెలో వేసుకుని  అందులో చిటికెడు  ఉప్పు  మరియు  చిటికెడు  సోడా  ఉప్పు వేసి  సరిపడా  నీళ్ళు  పోసి కనీసం  రెండు గంటల  ముందు నాన బెట్టుకోవాలి .

అలా కాకుండా  అర గ్లాసు మినపగుళ్ళు  మరియు రెండు గ్లాసుల  బియ్యము  విడిగా    సరిపడా  నీళ్ళు పోసుకుని  ముందు  రోజు  రాత్రి  నానబెట్టుకోవాలి .  మరుసటి  రోజు  నీరు వడకట్టుకొని  గ్రైండర్ లో  వేసుకుని   కొద్దిగా  నీళ్ళు  పోసుకుని  పిండిని  మెత్తగా   గ్రైండ్  చేసుకోవాలి .

పిండిని  గట్టిగా  వేసుకోవాలి .

బూరెలకు  అవసరమైన తోపు పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని  చాలా కొద్దిగా  అవసరమైన నీళ్ళు , చిటికెడు  సోడా ఉప్పు మరియు  చిటికెడు  మామూలు  ఉప్పు  వేసుకుని  తోపు  పిండిని  సిద్ధం  చేసుకోవాలి . 

ఈ పిండి  దోశెల  పిండిలా  ఉండాలి .

మిగిలిన  పిండిని  తర్వాత  దోశెలకు  వాడుకోవచ్చును .

ఇంక పూర్ణం  ఎలా  తయారు  చేసుకోవాలి ?

ఒక  గ్లాసు పచ్చి శనగపప్పు  సరిపడా  నీళ్ళు  పోసి  కుక్కర్  లో  మెత్తగా  ఉడకబెట్టుకోవాలి .

లేదా  గిన్నెలో  అయినా  ఉడక పెట్టు కోవచ్చును .

తర్వాత  పూర్తిగా  నీళ్ళు  లేకుండా  వడకట్టుకోవాలి .

ఆ తర్వాత  ఉడికిన  శనగపప్పు   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఆ తర్వాత  గ్లాసు బెల్లపు  పొడి  ( తరిగిన  బెల్లం ) ఒక  గిన్నెలో  వేసుకుని  చాలా  కొంచెము  నీరు పోసుకుని  స్టౌ  మీద పెట్టుకుని  బాగా  గరిటతో  తిప్పుకోవాలి .
బెల్లం  పూర్తిగా  కరగగానే  మిక్సీ   వేసుకొని  సిద్ధంగా  ఉంచుకున్న  శనగపప్పు  వేసుకుని  అడుగంటకుండా  బాగా దగ్గర  పడి  పూర్ణం  గట్టిగా  అయ్యే వరకు గరిటతో తిప్పు కోవాలి .

చేతితో  గట్టిగా  ఉండ అవుతుందో  లేదో  చూసుకోవాలి .

ఆ తర్వాత దింపుకుని   ముప్పావు స్పూను  యాలకుల పొడి  వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు  చేయి పట్టే  వేడి  చూసుకుని  పూర్ణం అంతా చిన్న లడ్డూల మాదిరిగా ఉండలుగా  కట్టుకొని  వేరే  ప్లేటులో  సిద్ధంగా  ఉంచుకోవాలి .

మనం పూర్ణం  మరియు  దానిపై  తోపు  రెండు  సిద్దం  చేసుకున్నాము .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ  పెట్టి  పూర్ణం  మునిగే వరకు  అంటే  షుమారు  ముప్పావు  కిలో  నూనె  పోసి  నూనెను బాగా కాగనివ్వాలి.

తయారు  చేసి  సిద్ధంగా  ఉంచుకున్న పూర్ణాలను తోపు పిండిలో  ముంచి అయిదారు  చొప్పున  బూరెలు నూనెలో  వేసుకుని , గరిటె తో  తిప్పుతూ  మాడకుండా  ఎర్రగా  వేయించుకోవాలి .

అలా  మొత్తం  పూర్ణం బూరెలు  వేయించుకోవాలి .

చేయడం కొంచెం  శ్రమ అన్పించినా ఈ పూర్ణం బూరెల  రుచి  అమోఘం.

ఈ  పూర్ణం  బూరెలకు  వేలితో  కన్నం చేసుకుని  దాని నిండా  వెన్న  కాచిన  నెయ్యి  వేసుకుని , ఒక్కొక్క బూరె నోట్లో వేసుకుని  తింటుంటే   -----

ఆహా !  ఏమి రుచి .

మరి  ఇప్పుడంటే  కాటరింగ్ లు , కర్రీ పాయింట్ లు , Sweet షాపులు  వీధి వీధికి వెలిసాయి  కాని  మరి  ప్రతి  పండగలకు మరియు ప్రతి శుభకార్యాలకు  మన బామ్మ , అమ్మమ్మ , అమ్మ , అత్తగారు    మరో మనిషి సాయం లేకుండా  25  మందికి  పైగా  ఒంటి చేత్తో  కట్టెల పొయ్యి , కుంపట్ల  మీద  కేవలం మూడు  నాలుగు గంటల్లో  రెండు కూరలు , రెండు పచ్చళ్ళు , పప్పు , పులుసు , గారెలు , పాయసం , పులిహోర మరియు ఈ పూర్ణం బూరెలు  అవలీలగా  చేసేవారు .

మరి  వారి  ఋణం  ఎన్ని జన్మలెత్తి  మనం తీర్చుకోగలం.

మరి వాళ్ళు  30 , 40 సంవత్సరాల  క్రితం చేసిన రుచి కూడా ఈనాటికీ  మన నాలిక మీద నాట్యం చేస్తోందంటే  ముఖ్య కారణం వారి Dedicaton  and Effection .

మరి  ఈ రోజుల్లో  వంట చేయడానికి ఇన్ని  ఆధునిక  సౌకర్యాలు  ఉన్నా కొంచెం  శ్రమ కూడా  పడలేక పోతున్నామంటే కారణం  అందుబాటులో  అన్నీ రెడీమేడ్ గా దొరకడమే .

మరి  ఈనాటి  బజారు వస్తువుల  రుచి  ఎలా ఉంటుంది  ?

ఎన్ని రోజులు  గుర్తుంటుంది ?

ఏది ఏమైనా  మనం  స్వయంగా  తయారు చేసుకున్న  రుచి , తృప్తి  బజారు వస్తువులకు  ఉంటుందా ?

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి