Thursday, October 12, 2017

ధనియాల పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

ధనియాల పొడి .

నోరు  అరుచిగా  ఉన్నా , జ్వరపడిన వారికి  పత్యం పెట్టాలన్నా , బాలింతలకు  పథ్యానికి  ఈ  ధనియాల పొడి  ఎక్కువగా  పెడతారు .

జలుబు  కఫం వంటివి  కూడా  హరిస్తుంది .

వేడి  వేడి అన్నంలో నెయ్యి బాగా వేసుకుని  ఈ పొడిని  మొదటి  ఐటమ్  గా  వేసుకుని  తింటే  ఆరోగ్య  రిత్యా  చాలా మంచిది .

కడుపులో  ఇబ్బందిగా  ఉన్నవారికి  , గ్యాస్  ప్రాబ్లమ్స్  ఉన్న వారికి  కూడా ఈ ధనియాల పొడి  వాడటం వలన  ఆ ఇబ్బందులు  తొలగి  పోతాయి .

ధనియాల పొడి  తయారీ  విధానము .

కావలసినవి .

ఎండుమిరపకాయలు  --   15
ధనియాలు  --  75  గ్రాములు
మినపప్పు  --  మూడు  స్పూన్లు
చింతపండు  --  చిన్న నిమ్మకాయంత
కరివేపాకు  --  రెండు రెమ్మలు .
ఉప్పు  --  తగినంత
నూనె  --  మూడు స్పూన్లు .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  గింజలు  లేకుండా  శుభ్రం  చేసుకోవాలి .

ధనియాలు  పుల్లలు  లేకుండా  శుభ్ర పరుచు కోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  మొత్తము  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మినపప్పు  , ధనియాలు , వేసి  వేయించుకుని , తర్వాత కరివేపాకు  కూడా  వేసి  కమ్మని  వేపు  వచ్చే వరకు  వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో   వేయించిన  దినుసులు  , చింతపండు  మరియు  తగినంత  ఉప్పు వేసి మెత్తగా   పొడిగా  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ధనియాల పొడి  సర్వింగ్  కు  సిద్ధం .

ఇందులో  మెంతులు , ఆవాలు , జీలకర్ర  , శనగపప్పు , ఇంగువ  వంటివి  వెయ్యరు .

వెల్లుల్లి  తినే  వారు  కూడా  ఇది  కేవలం  ధనియాల పొడి  కావున  వేసుకోపోవడం  మంచిది .

ఈ  పొడి  భోజనము  లోకే  కాకుండా  ఇడ్లీ , దోశెలలోకి కూడా  బాగుంటుంది .

శాకాన్నం

ఆలూరుకృష్ణప్రసాదు .

శాకాన్నం .

దేవీ నవరాత్రులలో  అమ్మ వారి   ఆరవ రోజు  అలంకారం   శ్రీ సరస్వతీ  దేవి .

సరస్వతీ  దేవి  నైవేద్యానికి  శాకాన్నం ను  తొమ్మిది  రకముల  కూరగాయలు  మరియు  ఐదు  రకముల  సుగంధ  దినుసులతో  కలిపి  తయారు  చేస్తారు .

ఈ శాకాన్నం తయారీకి  కావలసిన కూరగాయలు .

దొండకాయలు  -- 150    గ్రాములు
బీన్స్  --  100  గ్రాములు
క్యారెట్  --  రెండు
బంగాళాదుంపలు  --  రెండు
పచ్చి బఠాణి   --  50  గ్రాములు
పెద్ద  చిక్కుడు  కాయలు --  100  గ్రాములు
కాప్సికం  --  రెండు
చామదుంపలు  --  150 గ్రాములు
పచ్చిమిరపకాయలు  --  పది

కావలసిన  సుగంథ  ద్రవ్యములు.

యాలకులు  --  8
జాజికాయ  -- కొద్దిగా
జాపత్రి  --  కొద్దిగా
దాల్చిన  చెక్క --  చిన్న ముక్క
లవంగాలు  --  12

నెయ్యి  --  75  గ్రాములు.
జీడిపప్పు  --  30  గ్రాములు .
బియ్యము   --  300  గ్రాములు .

తయారు  చేయు  విధానము .

ముందుగా  పైన తెలిపిన  కూరలు అన్నీ  శుభ్రముగా  కడిగి  బంగాళాదుంప  , చామ దుంప  పై  చెక్కును  తీసుకుని , అన్ని కూరలు  చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి .

బియ్యము  ఒక  గిన్నెలో  పోసి తగినన్ని  నీరు  పోసి  ఒక అరగంట  సేపు  నానబెట్టుకోవాలి.

స్టౌ  మీద  బాండీ  పెట్టుకుని  మూడు స్పూన్లు  నెయ్యి వేసి  ముందుగా  జీడిపప్పు  వేయించుకుని  పక్కన  పెట్టుకోవాలి.

అదే నెయ్యిలో  సుగంథ ద్రవ్య  దినుసులన్నీ  వేయించుకుని  చల్లారగానే  రోటిలో కాని , అమాన్ దస్తాలో  కాని   మెత్తగా  పొడి  చేసుకుని  విడిగా  ఉంచుకోవాలి .

కడిగి  గిన్నెలో  సిద్ధంగా  ఉన్న బియ్యము  లో  నీళ్ళు  సరి  చూసుకుని , తరిగిన  కూరలన్నీ గిన్నెలో   వేసి , కుక్కర్  మూత  మరియు విజిల్  పెట్టి , స్టౌ  మీద  మూడు  విజిల్స్  వచ్చే వరకు ఉడికించి  స్టౌ ను ఆపేయాలి .

విజిల్  ఊడి  రాగానే  వేడి  వేడి  కూరగాయల అన్నాన్ని  బేసిన్  లోకి  వంపుకొని అందులో  సరిపడ  ఉప్పు , సుగంధ  ద్రవ్య దినుసుల పొడి , వేయించి సిద్ధంగా  ఉంచుకున్న  జీడిపప్పు  మరియు  మిగిలిన  నెయ్యి  వేసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి ,

అంతే  శరవన్నవరాత్రులలో  ఆరవ రోజైన  శ్రీ సరస్వతీ  దేవి   నైవేద్యానికి  శాకాన్నం  సిద్ధం.

కొబ్బరిపాలతో కొబ్బరన్నం

అమ్మ వారి ప్రసాదం .

కొబ్బరి  పాలతో  కొబ్బరి  అన్నం.

తయారీ విధానము .

ముందుగా   గిన్నెలో  ఒక గ్లాసు  బియ్యం  పోసుకుని రెండు గ్లాసుల  నీళ్ళు  పోసుకుని  ఒక పది హేను నిముషములు  నానబెట్టుకుని నీళ్ళు వార్చుకోవాలి .

కొబ్బరి  కాయను  పగుల కొట్టి    రెండు చిప్పలూ  పచ్చి కొబ్బరి కోరాముతో  తురుముకుని  మిక్సీ లో  వేసుకుని   రెండు కప్పులు  కొబ్బరి  పాలు  తీసుకోవాలి .

దాల్చిన  చెక్క , బిర్యాని  ఆకు , జీడిపప్పు  , యాలకులు , లవంగాలు  సిద్ధం చేసుకోవాలి .

మూడు  పచ్చి మిర్చి  సన్నగా  తరుగు కోవాలి .

అల్లం  సన్నగా  తరుగు కోవాలి .

క్యారెట్  తీసుకుని  ఎండు కొబ్బరి  కోరాముతో  తురుము కోవాలి .

ఇప్పుడు   స్టౌ  మీద  కుక్కర్ పెట్టి  మూడు   స్పూన్లు   నెయ్యి  వేసి  నెయ్యి బాగా కాగగానే   ముందుగా   బిర్యాని ఆకు , లవంగాలు , మిరియాలు , జీడిపప్పు , యాలకులు ,  క్యారెట్  తురుము , పచ్చి మిర్చి  ముక్కలు , అల్లం  ముక్కలు  వేయించుకుని  తర్వాత  నాన బెట్టిన  బియ్యం వేసి , అందులో  కొబ్బరి  పాలు , మరియు అర గ్లాసు  నీళ్ళు పోసి  కుక్కర్  మూత  పెట్టి  మూడు  విజిల్స్  రానివ్వాలి .

విజిల్  రాగానా  పొదీనా  ఆకు  ,  సరిపడా  ఉప్పు  వేసి మరియు  మూడు  స్పూన్లు   నెయ్యి  వేసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

తర్వాత  అమ్మ  వారికి  నివేదన  చేసి  అందరికీ  సర్వ్  చేయాలి .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి