Monday, May 29, 2017

మైసూర్ రసం

మైసూర్ రసం 
ఆలూరి కృష్ణ ప్రసాద్

తయారీ విధానం.
కావలసిన పదార్ధములు ; ---
పచ్చి శనగపప్పు -- 50 గ్రాములు
చింతపండు --- 25 గ్రాములు
టమోటాలు --- ఓ మాదిరి సైజువి -- 4
కరివేపాకు --- మూడు రెమ్మలు 
 కొత్తిమీర --- ఒక చిన్న కట్ట 
పచ్చి మిరపకాయలు -- 3

మైసూర్ రసంలోకి ముద్ద తయారీ విధానం.
కావలసిన పదార్ధములు ---
ఎండు మిరపకాయలు -- 3
ధనియాలు --- 2 టీ స్పూన్లు
పచ్చి శనగపప్పు -- 1 స్పూన్ 
ఆవాలు -- తగినన్ని
మిరియాలు -- పావు టీ స్పూన్ 
ఇంగువ -- తగినంత
పచ్చి కొబ్బరి --- చిన్న గరిటెడు
--- తురిమినది .

తయారు చేయు విధానం ---
ముందుగా పచ్చి శనగపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి సగానికి పైగా ఉడక నివ్వాలి .
అలా ఉడికుతున్న సమయంలో టమోటాలు కాస్త పెద్ద ముక్కలుగా తరిగి అందులో వేసి ఉడక నివ్వాలి .
టమోటాలు ఉడికాక పై తొక్కను వలచి ముక్కలు పక్కన పెట్టుకోవాలి .
చింతపండులో తగినన్ని నీరు పోసి ఓ పావుగంట నాన బెట్టుకోవాలి.
తదుపరి మాములుగా పిండి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి .

ఇప్పుడు మైసూర్ రసం ముద్ద కోసం స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్ల నూను వేసి నూనె బాగా కాగాక ఎండు మిరపకాయలు , ధనియాలు , పచ్చి శనగపప్పు , మిరియాలు వేసి వేగాక ఆవాలు ఇంగువ పచ్చి కొబ్బరి వేసి దింపి పక్కన పెట్టుకుని చల్లారాక మిక్సిలో వేసి తగినంత నీరు పోసి ముద్దగా చేసుకోవాలి.
ముద్ద మెత్త పడగానే ఉడికిన పచ్చి శనగపప్పు , ఉడికిన టమోటాలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఆ తర్వాత ఆ ముద్దను ఒక గిన్నె లోకి తీసుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసం కలుపుకుని సరిపడా నీళ్ళు చేర్చుకుని అందులో కొద్దిగా పసుపు , తరిగిన పచ్చిమిరపకాయలు , సరిపడా ఉప్పు , కరివేపాకును వేసి బాగా కలిపి స్టౌ మీద పెట్టి బాగా తెర్ల నివ్వాలి.
తర్వాత దింపి కొత్తిమీర వేసి పోపు పెట్టుకోవాలి.
ఆ పోపులో రెండు ఎండు మిరపకాయలు , కొద్దిగా మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువా వేసి పెట్టు కోవాలి.
అంతే ఘమ ఘమ లాడే రుచికరమైన మైసూర్ రసం సిద్ధం.

ఇది రసం కనుక ఇతర ముక్కలు వేసుకోనవసరం లేదు .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి