Sunday, July 23, 2017

రాగిపిండి జావ

ఆరోగ్యానికి   రాగి  పిండితో  జావ.
ఆలూరు కృష్ణప్రసాదు .

ఒక  కప్పు  రాగి పిండి  ఒక  గిన్నెలో  వేసుకుని   అందులో  మూడు కప్పుల  నీళ్ళు  పోసి మరియు  కొద్దిగా   ఉప్పు  వేసి  బాగా  కలుపుకుని  స్టౌ మీద  పెట్టి ఒక  పదిహేను  నిముషాల  పాటు మీడియం  సెగన    బాగా  ఉడకనివ్వాలి .
ఉడికిందో  లేదో  చెయ్యి  తడి చేసుకుని  చూస్తే  చేతికి  అంటకూడదు .
చల్లారగానే  చేతితో  చిన్న  ఉండలుగా  చేసుకుని   అందులో మజ్జిగ  పోసి  మరి కాస్త  ఉప్పు వేసి రాత్రంతా   మజ్జిగలో  నానబెట్టాలి .
మరుసటి  రోజు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  ఒక  ఎండుమిర్చి , జీలకర్ర , ఆవాలు ,కరివేపాకు  వేసి  పోపు  వేసుకుని  అందులో  సన్నగా తరిగిన  ఒక  ఉల్లిపాయ  ముక్కలు  మరియు సన్నగా  తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు  వేసి  మగ్గనిచ్చి  ఆ తర్వాత  ఈ  రాగి  జావలో  వేసి  ఉండలుగా  ఉన్నట్లయితో  చేతితో  బాగా  నలిపి  అవసరమైతే  మరి  కాస్త  మజ్జిగ   పోసుకుని  జావలా  పల్చగా   చేసుకుని  ప్రతిరోజు  ఉదయాన్నే  ఒక  గ్లాసు  మోతాదులో  తీసుకోవాలి .
ఈ రాగి  జావ  సన్నపడాలనుకునే వారికి   మంచిది.
శరీరానికి  చలువ చేస్తుంది
మధుమేహ  వ్యాధిగ్రస్తులకు  కూడా  చాలా మంచిది.
ఎముకలకు  పుష్టి నిస్తుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి