Tuesday, July 18, 2017

మైదాపిండి వల్ల నష్టాలు

మైదాపిండి వల్ల నష్టాలు
ఆలూరు కృష్ణప్రసాదు .

మైదా పిండితో  తయారయ్యే  పదార్ధములను  తినడం వలన కలిగే  దుష్పరిణామములు .
గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి, 
రాగుల నుండి రాగిపిండి వస్తుంది.

కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది........? ఎప్పుడైనా ఆలోచించారా.........?
మైదా పిండి ఎలా వస్తుంది........ 
అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ........

ఒక్కసారి దీన్ని చదివితే మీకు అర్థమవుతుంది.
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.
బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా , ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.
మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు.
మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు 
*********************************** 
మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి