Sunday, July 23, 2017

మిరపకాయ శనగపిండి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

బజ్జీ  మిరపకాయలలో  శనగ పిండి   కూరిన  కూర .

కావలసినవి.

బజ్జీ మిర్చి  --  పావు కిలో
శనగపిండి  --  అర కప్పు
జీలకర్ర   --  పావు  స్పూను
ఉప్పు  --  తగినంత
నూనె  --  100  గ్రాములు
కారం  --  అర  స్పూను

తయారీ  విధానము .

ముందుగా   స్టౌ  మీద  బాండీ పెట్టి  నూనె  వేయకుండా  శనగపిండి , జీలకర్ర   వేసి  కమ్మని  వాసన  వచ్చేదాకా   వేయించుకోవాలి .

అందులో  అర  స్పూను  కారం  మరియు  సరిపడా  ఉప్పు వేసి  బాగా  కలుపుకోవాలి .

పచ్చిమిర్చి   నిలువుగా   మధ్యలో  గాటు  పెట్టుకుని  ఈ  మిశ్రమాన్ని   అందులో  కూరుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  మళ్ళీ  బాండి  పెట్టుకుని  మొత్తం   నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   స్టౌ ను  మీడియం  సెగన పెట్టి  కూరిన  బజ్జీ  మిర్చి  వేసి  పిండి  మరియు  మిర్చి   మాడకుండా  జాగ్రత్తగా   అట్లకాడతో  కదుపుతుండాలి  .

కూర  వేగగానే కూరిన పిండి  మిగిలితే  అదికూడా  కూర పైన  వేసి మరో  మూడు  నిముషాలు   ఉంచి  దింపి  వేరే  ప్లేటులోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  బజ్జీ పచ్చి మిర్చి శనగ పిండి కూర  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి