Sunday, July 2, 2017

కజ్జికాయలు

కజ్జి  కాయలు .
                                                                            ఆలూరు కృష్ణప్రసాదు .

తయారీ  విధానము .
ముందుగా  ఒక కప్పు  మైదా  పిండిలో  చిటికెడు  ఉప్పు వేసి  కొద్దిగా   కాచిన  నూనె  పోసి  సరిపడా  నీళ్ళు  పోసుకుంటూ  పూరీల పిండిలా  కలుపుకుని  పక్కన  పెట్టుకోవాలి .
ముందుగా  రెండు  ఎండు  కొబ్బరి  చిప్పలు  ఎండు  కొబ్బరి  కోరాముతో  తురుము  కోవాలి .
బెల్లము  ఒకటిన్నర   కప్పు  పొడిగా  చేసుకోవాలి  .
ఒక  కప్పు  పుట్నాల  పప్పు  సిద్ధంగా   ఉంచుకోవాలి  .
  
ఈ  మూడింటిని   మరియు  అర స్పూను   యాలకుల  పొడిని  మిక్సీ  లో   వేసి  మరీ  మెత్తగా  కాకుండా  వేసుకోవాలి .

ఇప్పుడు  కజ్జి కాయలలో  మనం  పెట్టుకునే  మిశ్రమం   సిద్ధం  అయ్యింది .
ఇప్పుడు  అప్పడాల  పీట  పై  ముందుగా  మనం  సిద్ధంగా  ఉంచుకున్న  పిండిని  చిన్న  చిన్న ఉండలుగా  చేసుకుంటూ  అప్పడాల  పీటపై   చిన్న  చిన్న పూరీల  మాదిరిగా   పల్చగా  వత్తుకుని     కజ్జి కాయల  చెక్కను  తీసుకొని  వత్తుకున్న పిండిని   పెట్టి అందులో పెట్టి  స్పూనున్నర  ఎండు కొబ్బరి  మిశ్రమం  పెట్టి  వత్తి  చివరలు నీళ్ళ చేయితో  తడిపి  మూసి  అంచుల పక్కన  ఉన్న  అదనపు  పిండిని    తీసి  వేయాలి .
ఇలా  ముందుగా  అన్ని  కజ్జి కాయలు   సిద్ధం  చేసుకోవాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  అర కె. జి . నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   ఒక్కొక్క  కజ్జి కాయను  వేసుకుంటూ అలా  ఐదారు  కజ్జి కాయల  చొప్పున  వేసి బంగారు  రంగు  వచ్చే వరకు   వేయించు కోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  కజ్జి కాయలు  సర్వింగ్  కు  సిద్ధం .
ఈ  కజ్జికాయలు  15   రోజులు  పైన  నిల్వ  ఉంటాయి .
ఇందులో  వేయించిన  శనగపప్పు   బదులుగా  ఒక  కప్పు  బొంబాయి  రవ్వ   నేతిలో  వేయించి  ఎండు కొబ్బరి  పొడి  మరియు  బెల్లం పొడి గాని  లేదా  పంచదార  పొడి  గాని  వేసి  చేసుకుంటారు .
ఒక చోట  పచ్చి   కొబ్బరి  మరియు బెల్లం  పాకం  పట్టి  కొబ్బరి  లౌజు  లాగా  చేసి  ఆ  లౌజును    కజ్జి కాయలలో  పెట్టి  వేయించారు  .
అది  కూడా బాగానే  ఉంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి