Sunday, July 2, 2017

పల్లీ పకోడీలు

పల్లీ  పకోడీలు .
ఆలూరు కృష్ణప్రసాదు .

తయారీ  విధానము .
ఒక కప్పు పల్లీలు  పొట్టు తోనే  మూడు గంటలు  తగినన్ని  నీళ్ళు పోసి  నానబెట్టు కోవాలి .
ఆ తర్వాత  మిక్సీ లో  కచ్చా  పచ్చాగా  వేసుకోవాలి .
అందులో  ఒక  కప్పు  శనగపిండి  , రెండు  స్పూన్లు  బియ్యపు  పిండి , స్పూను   జీలకర్ర  , స్పూనున్నర   తరిగిన  అల్లం ముక్కలు , కొద్దిగా   తరిగిన  కరివేపాకు  ,కొద్దిగా  తరిగిన   కొత్తిమీర  , స్పూను   కారం ,  తగినంత  ఉప్పు  , చిటికెడు   సోడా  ఉప్పు  వేసి కొద్దిగా   నీళ్ళు  పోసుకుంటూ  గట్టిగా   కలుపు కోవాలి .
ఆ  తర్వాత  స్టౌ  మీద  బాండి  పెట్టుకుని  అర  కె. జి  .  నూనె  పోసుకుని   నూనె  బాగా  కాగగానే  పకోడీలు  వేసుకొని  బంగారు  రంగు  రాగానే  తీసుకోవాలి .
అంతే  వేడి  వేడి  పల్లీ  పకోడీలు   మధ్యాహ్నము   టిఫిన్  కు  సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి