Monday, July 9, 2018

కొబ్బరి దోశలు

ఆలూరుకృష్ణప్రసాదు .

కొబ్బరి  దోశెలు.

కావలసినవి .

బియ్యము --  కప్పు.
మినపగుళ్ళు -- పావు కప్పు.
పచ్చి కొబ్బరి  చిప్ప -- ఒకటి
ఉప్పు -- తగినంత
నూనె  -  పావుకప్పు .

తయారీ విధానము .

ముందుగా  బియ్యము  మరియు మినపగుళ్ళు ఒక గిన్నెలో పోసుకుని నాలుగు  గంటల సేపు నానబెట్టు కోవాలి .

పచ్చి కొబ్బరిని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా  కోసుకోవాలి .

తరువాత  నానబెట్టిన బియ్యము మినపగుళ్ళు  గ్రైండర్ లో వేసుకుని  కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మెత్తగా  దోశెల పిండి మాదిరిగా  గ్రైండ్ చేసుకోవాలి .

అందులోనే  పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దోశెల పిండి మాదిరిగా గ్రైండ్  చేసుకుని  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

ఆ పిండిలో తగినంత  ఉప్పు కలుపుకుని  గరిటెతో బాగా కలుపుకుని , ఒక గంట సేపు పిండిని బయట ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద పెనం పెట్టుకుని , పెనం బాగా వేడెక్కగానే  నూనె వేసుకుని  పల్లగా  దోశెల మాదిరిగా  పోసుకోవాలి .

ఈ కొబ్బరి దోశెలు  కొబ్బరి చట్నీ లేదా అల్లపు చట్నీతో తింటే చాలా రుచిగా  ఉంటాయి .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి