Wednesday, July 4, 2018

కాకరకాయ కాయల పళంగా కొబ్బరి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

కాకరకాయ  కాయల పళంగా  కొబ్బరి  కారం  వేపుడు కూర.

కావలసినవి .

ముందు కొబ్బరి  కారానికి .

ఎండుమిరపకాయలు  -- 10 
పచ్చి  శనగపప్పు  --  మూడు స్పూన్లు .
జీలకర్ర  --  స్పూను .
ఎండుకొబ్బరి  --  పావు చిప్ప . చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
కరివేపాకు  --  నాలుగు రెమ్మలు.

ఇవ్వన్నీ  నూనె  వేయకుండా  బాండిలో  కమ్మని వేపు  వచ్చేదాకా వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీలో  వేసుకుని  తగినంత  ఉప్పు వేసుకుని  మెత్తగా  పొడి  చేసుకోవాలి.

కాకరకాయలు  అరకిలో తీసుకుని  కాయ  మధ్యలో చాకుతో గాటు పెట్టుకోవాలి ,

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ పెట్టి   150  గ్రాముల  నూనె వేసి  నూనె బాగా కాగగానే ముందుగా  కాకరకాయ లను  నూనెలో వేసి  బాగా  ఎర్రగా వేగ నివ్వాలి .

తరువాత  సిద్ధంగా  ఉంచుకున్న  కొబ్బరి కారం పొడి  కాయలలో  కూరి , కాగుతున్న వేడి వేడి నూనె స్పూనున్నర  చొప్పున కాయలలో పోయాలి .

వెల్లుల్లి  ఇష్టమైన వారు  ఆరు  వెల్లుల్లి  రెబ్బలు  పొడిలో వేసుకుని మిక్సీ  వేసుకుంటే  ఈ కాకరకాయ వేపుడు కూర చాలా రుచిగా  ఉంటుంది .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  కాకరకాయ కాయల పళంగా  కొబ్బరి  కారం వేపుడు కూర సర్వింగ్  కు సిద్ధం.

ఈ వేపుడు  కూర వేడి వేడి  అన్నంలో నెయ్యి  వేసుకుని  తింటే  చాలా రుచిగా  ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి