Wednesday, July 4, 2018

వివిధ పప్పుధాన్యాలతో పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కందిపప్పు , పచ్చిశనగపప్పు  మరియు చాయపెసరపప్పు  మూడు కలిపిన పచ్చడి .

కావలసినవి .

కందిపప్పు  -  ఒక కప్పు
పచ్చిశనగపప్పు  -  అర కప్పు
చాయపెసరపప్పు - పావు కప్పు
ఎండుమిరపకాయలు -  12
నూనె  - మూడు స్పూన్లు
జీలకర్ర  - ముప్పావు స్పూను
ఇంగువ - కొద్దిగా
చింతపండు  -  చిన్న నిమ్మకాయంత
పసుపు  --  కొద్దిగా
ఉప్పు   - తగినంత

తయారీ విధానము .

ముందుగా  చింతపండు  విడదీసి కొద్దిగా  నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి .

స్టౌ  మీద బాండీ పెట్టి మొత్తము  నూనె వేసి నూనె బాగా కాగగానే , ముందుగా  కందిపప్పు , పచ్చిశనగపప్పు , ఎండుమిరపకాయలు మరియు  జీలకర్రను  వేసి పప్పును సగం వేగనివ్వాలి .

తర్వాత  అందులో చాయపెసరపప్పు  మరియు ఇంగువ వేసి పప్పులను  పూర్తిగా  కమ్మని వాసన వచ్చేదాకా  వేగనివ్వాలి .

చల్లారగానే  ముందుగా  ఎండుమిరపకాయలు , పసుపు  మరియు ఉప్పును మిక్సీ లో వేసి  మెత్తగా మిక్సీ వేసుకోవాలి .

తర్వాత  మిగిలిన  పప్పులు మరియు తడిపిన చింతపండును వేసి ,  కొద్దిగా  నీళ్ళు పోసుకుని మరీ  మెత్తగా కాకుండా  మిక్సీ   వేసుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .

తర్వాత   స్టౌ మీద పోపు గరిటె పెట్టి , రెండు స్పూన్లు  నెయ్యి వేసి  రెండు ఎండుమిర్చి  ముక్కలుగా చేసి , చాయమినపప్పు  అర స్పూను , ఆవాలు పావు స్పూను , కరివేపాకు  రెండు రెమ్మలు తో పోపు పెట్టుకుని   స్పూను తో కలుపు కోవాలి.

ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు, చపాతీలు , రోటీలు మరియు భోజనము లోకి కూడా చాలా రుచిగా  ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి