Wednesday, July 4, 2018

సాంబారు పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

సాంబారు  పొడి .

సాంబారు  రుచికరంగా  తయారవ్వాలంటే  సాంబారు  పొడి  కాని  లేక సాంబారు  ముద్ద  కాని  వేసుకోవాలి .

దక్షిణాదిన  తమిళనాడు వారే  రక రకాల  సాంబారులు  ప్రతి రోజు  పెట్టుకుంటారు .

ప్రతిరోజు  భోజనములో వారు సాంబారుతో పాటుగా  రసము కూడా  పెట్టుకుంటారు .

దక్షిణాది వారు  సాంబారులో  అన్ని రకములైన కాయగూరలు మరియు ఎక్కువ  మోతాదులో  పప్పు వేసి  బాగా  చిక్కగా  సాంబారు  పెట్టుకుంటారు.

ఉదయం ఇడ్లీ , వడలు  మొదలైన  టిఫిన్ల లో  సాంబారు  ఒక రకంగా , మధ్యాహ్నము  భోజనము  లోకి  సాంబారు  మరో రకంగా  పెట్టుకుంటారు .

మన ఆంధ్రాలో  దొరికే  సాంబారు  పొడులు  అంత రుచిగా  ఉండవు .

తమిళనాడులో  అంబిక , శక్తి  ఇంకా  ఇతర కంపెనీ వారి సాంబారు పొడులు  ప్రతి షాపులోను  విరివిగా  దొరుకుతాయి .

వాటిలో  With మసాలా , Without  మసాలా అని  కూడా  ఉంటాయి .

మసాలా  అంటే  దాల్చిన  చెక్క మరియు లవంగాలు వాసన వేస్తూ  పొడి చాలా ఘూటుగా  ఉంటుంది .

మసాలా వేయనిది  అంటే  పై వస్తువులు  వేయకుండా  చేసినది కూడా దొరుకుతుంది .

మామూలుగా  సాంబారు లోకి  మసాలా  వేయనిదే  రుచిగా  ఉంటుంది .

ఈ సాంబారు పొడి  నెలకు సరిపడా  ఇంట్లోనే  తయారు చేసుకోవచ్చు .

సాంబారు పొడి .

తయారీ  విధానము .

కావలసినవి.

ఎండుమిరపకాయలు  -- 15
చాయమినపప్పు  -- 75 గ్రాములు
పచ్చి శనగపప్పు  -- 50 గ్రాములు.
కందిపప్పు  --  25 గ్రాములు
బియ్యము  --  రెండు స్పూన్లు 
మెంతులు  --  స్పూను
జీలకర్ర  --  స్పూను
ఆవాలు --  అర స్పూను.
ధనియాలు  --  100 గ్రాములు.
మిరియాలు  --  షుమారు  25
ఇంగువ  --  పొడి  కాకుండా  పలుకులు 5 ముక్కలు
కరివేపాకు  --  తడి లేకుండా  పొడిది  ఒకటిన్నర  కప్పు.
పసుపు  --  ఒక స్పూను.

తయారీ  విధానము .

ముందుగా  చాయ మినపప్పు , పచ్చి శనగపప్పు , కందిపప్పు , బియ్యము , ధనియాలు  నూనె  అసలు  వేయకుండా  ఒక బాండిలో  కమ్మని  వాసన వచ్చేదాకా  వేయించుకుని  విడిగా  వేరే పళ్ళెంలోకి  తీసుకోండి .

దానిపైన  స్పూను  పసుపు  వేసుకోండి .

ఆ తర్వాత స్టౌ మీద  బాండీ  పెట్టి  కరివేపాకు  నూనె  వేయకుండా  ఎర్రగా వేయించుకుని  వేరేగా ఉంచుకోండి .

ఆ తర్వాత  తిరిగి  బాండిలో  నూనె లేకుండా  ఎండుమిరపకాయలు ,  మెంతులు , జీలకర్ర , ఆవాలు , మిరియాలు , ఇంగువ పలుకులు కూడా  వేసి  వేయించుకోండి .

ముందుగా  మిక్సీ లో  మొదట వేయించుకున్న ధనియాలు , శనగపప్పు , కందిపప్పు , మినపప్పు  తదితర మిశ్రమాన్ని  వేసి  మెత్తగా  పొడి వేసుకుని  ఒక బేసిన్  లో  తీసుకోండి .

తర్వాత  రెండవసారి  వేసుకున్న  ఎండుమిరపకాయలు , జీలకర్ర , మెంతులు , ఇంగువ మిశ్రమాన్ని ,  వేయించిన  కరివేపాకు  కూడా  వేసి   మిక్సీ లో మెత్తగా  వేసుకుని  ముందు తీసుకున్న  బేసిన్  లో  వేసుకుని  రెండూ చేతితో బాగా  కలుపుకుని  ఒక  సీసాలో  పోసుకుని  ఫ్రిజ్ లో పెట్టుకుని  అవసరమైనప్పుడు మూడు  స్పూన్లు  చొప్పున  సాంబారు లో  వేసుకుని , తిరిగి  సీసాను  ఫ్రిజ్ లో పెట్టుకుంటే  నాలుగు  నెలలు పైన  ఈ సాంబారు  పొడి  ఘమ ఘమ లాడుతూ  సాంబారుకు  మంచి రుచి  వస్తుంది.

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి