Saturday, April 14, 2018

చాయపెసరపప్పు , పచ్చికొబ్బరి మరియు మామిడి కాయ ముక్కలతో పచ్చడి .

ఆలూరుకృష్ణప్రసాదు .

చాయపెసరపప్పు , పచ్చికొబ్బరి మరియు మామిడి  కాయ ముక్కలతో పచ్చడి .

కావలసినవి .

చాయపెసరపప్పు  --  50 గ్రాములు .

రెండు గంటల సేపు తగినన్ని  నీరు పోసి నానబెట్టుకుని  వడకట్టుకోవాలి .

పచ్చి కొబ్బరి  --  అర చిప్ప .

చిన్న ముక్కలుగా చేసుకోవాలి .

పుల్లని పచ్చి మామిడి  కాయ  --  సగం  కాయ .
 
పై చెక్కు తీసుకుని చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

ఎండుమిరపకాయలు  -  8

జీలకర్ర  --  స్పూను

పచ్చి ఇంగువ --  పావు స్పూనులో  సగం .

పసుపు  --  కొద్దిగా

ఉప్పు  --  తగినంత

తయారీ  విధానము .

ముందుగా  మిక్సీ లో  ఎండుమిరపకాయలు  ( వేయించనవసరం లేదు ) , జీలకర్ర   , పసుపు , పచ్చి ఇంగువ  మరియు తగినంత ఇంగువ  వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తరువాత  పచ్చి కొబ్బరి ముక్కలు , మామిడి కాయ ముక్కలు  మరియు నానబెట్టిన చాయపెసరపప్పు ను  కూడా మిక్సీ లో వేసుకుని  మధ్యలో కొద్దిగా  నీళ్ళు పోసుకుని మరీ మెత్తగా  కాకుండా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

తర్వాత స్టౌ మీద పోపు గరిటెను  పెట్టుకుని  మూడు  స్పూన్లు  నెయ్యి వేసుకుని  మూడు ఎండుమిరపకాయలు  ముక్కలుగా చేసి , స్పూను చాయమినపప్పు , అర స్పూను  ఆవాలు  మరియు  రెండు రెమ్మలు కరివేపాకును వేసి పోపు పెట్టుకుని  పచ్చడిలో కలుపుకోవాలి .

ఈ పచ్చడి లో  కొబ్బరి ముక్కలు మరియు మామిడి కాయ ముక్కలు వేస్తాము కనుక  భోజనము లోకే కాకుండా  ఇడ్లీ  మరియు దోశెల లోకి కూడా  చాలా రుచిగా  ఉంటుంది .

హామీ పత్రం .

సంబంధిత  ఫోటో  మరియు  రెసిపీ  నా  స్వంతం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి