Saturday, April 14, 2018

మరో వెరైటి దోశెలు

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో వెరైటీ  దోశెలు.

చల్ల (  మజ్జిగ  )  దోశెలు.

కావలసినవి .

మజ్జిగ  --  మూడు కప్పులు .
బియ్యము  --  కప్పు
మినపగుళ్ళు  --  ఒక  గరిటెడు.
మెంతులు  --  అర  స్పూను .

ఉల్లి కారమునకు . ( దోశెల పైన రాయడానికి  )

ఉల్లిపాయలు  -   రెండు ( ముక్కలుగా  తరుగుకోవాలి )
ఎండుమిరపకాయలు  - రెండు
పచ్చిమిర్చి  --  నాలుగు
జీలకర్ర  --  అర స్పూను
ఉప్పు  --  తగినంత .
పసుపు  --  కొద్దిగా
నూనె --  ఒక  50  గ్రాములు .

తయారీ విధానము .

ముందుగా బియ్యము , మినపగుళ్ళు  నీళ్ళల్లో కడగాలి .

ఒక గిన్నెలో  మజ్జిగ  పోసుకుని  అందులో   బియ్యము  , మినపగుళ్ళు , మెంతులు  వేసుకుని  ఒక అయిదు గంటల సేపు నానబెట్టుకోవాలి .

తర్వాత  గ్రైండర్ లో  వేసుకుని  , కొద్దిగా  ఉప్పు వేసుకుని  దోశెల పిండిలా  మెత్తగా  వేసుకోవాలి . 

రుబ్బిన పిండిని  విడిగా  వేరే గిన్నె లోకి తీసుకోవాలి .

తర్వాత   మిక్సీ లో  ఉల్లిపాయ  ముక్కలు , జీలకర్ర , రెండు ఎండుమిరపకాయలు  , నాలుగు  పచ్చి మిరపకాయలు , కొద్దిగా  పసుపు  మరియు  కొద్దిగా  ఉప్పు  వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఈ కారాన్ని  వేరేగా  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  పెనం పెట్టి  పెనం వేడెక్కగానే  పల్చగా  దోశెలు  వేసుకుని ఒక్కొక్క  దోశె   పైన  ఒక స్పూను  ఉల్లి కారం వేసుకుని  అట్లకాడతో  దోశె అంతా రాసి , స్పూను  నూనె వేసి  రెండు వైపులా  బాగా  కాలనివ్వాలి .

ఇలాగే  అన్ని దోశెలు  వేసుకోవాలి .

ఈ దోశెలు  కొబ్బరి  చట్నీతో  చాలా రుచిగా  ఉంటాయి .

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటోలు   నా స్వంతం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి