Saturday, April 14, 2018

వెరైటి దోశెలు

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో  వెరైటీ  దోశెలు  .

మూడు గ్లాసుల  పుల్లని  మజ్జిగ  లో  ఒక  గ్లాసు  అటుకులు , రెండు  గ్లాసుల  బియ్యము   కలిపి  ముందు  రోజు  రాత్రి  నాన బెట్టు కోవాలి .

ఉదయాన్నే  అయిదు  పచ్చిమిర్చి ,  ఒక తరిగిన   ఉల్లిపాయ   తగినంత  ఉప్పు  వేసి  మెత్తగా  మిక్సీ   వేసుకోవాలి  .

బయట  ఒక  గంట సేపు  ఉంచాలి .

తర్వాత  స్టౌ  మీద  పెనం  పెట్టుకుని  దోశెల లాగా  వేసుకోవాలి .

ఈ  దోశెలు  చాలా  మృదువుగా   ఉంటాయి .

ఈ  దోశెలలోకి  వెరైటీగా  పండు మిరపకాయల పెరుగు చట్నీ చేసాము .( ఫోటోలో  చూడండి  . )

ఎంతో  రుచిగా  ఉంది .

రెసిపీ  విడిగా  పెడుతున్నాను .

సంబంధిత  రెసిపీ మరియు ఫోటో  నా స్వంతం .

*************************

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి