Saturday, April 14, 2018

పండిమిరప చట్నీ

ఇడ్లీ , దోశెలు , గారెలు , పూరీలు , రోటీలు  మరియు  చపాతీల లోకి  మూడు  నిముషాల్లో  తయారు  చేసుకునే పండుమిరపకాయలతో చట్నీ.
******************************

ఆలూరుకృష్ణప్రసాదు .

తయారీ విధానము .

మూడు  స్పూన్లు  పండు మిరపకాయల  పచ్చడి (  కొరివి కారం )  తీసుకోండి .

పండు మిరపకాయల  పచ్చడిలో  తయారు చేసేటప్పుడే  ఉప్పు , చింతపండు , ఇంగువ   మరియు మిరపకాయల  కారము ఉంటాయి .

మళ్ళీ  ప్రత్యేకంగా  ఏవీ వేయవలసిన అవసరం ఉండదు .

ఈ పండుమిరపకాయల పచ్చడి మరియు గరిటె  పెరుగు  మిక్సీ లో వేసి  మెత్తగా మిక్సీ  వేసుకోండి .

తర్వాత  ఈ చట్నీ వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

తర్వాత  స్టౌ  మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి , నెయ్యి బాగా కాగగానే  వరుసగా  రెండు  ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసి , స్పూను  చాయమినపప్పు , అర స్పూను  ఆవాలు మరియు కరివేపాకు  వేసి పోపు  వేసుకుని , ఈ పోపు  చట్నీలో  వేసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  పండు మిరపకాయల  చట్నీ  సర్వింగ్  కు సిద్ధం .

సంబంధిత  రెసిపీ  మరియు  ఫోటో నా స్వంతం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి