Saturday, January 6, 2018

నువ్వుల పొడితో చింతపండు   పులిహోర.

నువ్వుల పొడితో చింతపండు   పులిహోర.

కావలసినవి .

చింతపండు   --  75 గ్రాములు  గింజలను  తీసుకుని గ్లాసున్నర  వేడినీటిలో  పదిహేను నిముషములు  నానబెట్టుకోవాలి .

తదుపరి  వేరే గిన్నెలో  చిక్కగా రసం తీసుకోవాలి .

నువ్వు పప్పు  --  75 గ్రాములు.
నూనె  వేయకుండా  నాలుగు  ఎండుమిరపకాయలు వేసి  బాండిలో  వేయించుకుని  ఆ తర్వాత మిక్సీ లో  మెత్తగా  పొడి వేసుకోవాలి .

ఈ పొడి  విడిగా  ఉంచుకోవాలి .

పచ్చిమిర్చి   --  పది . తొడిమలు తీసుకుని  ఉంచుకోవాలి .
కరివేపాకు   --  ఎనిమిది   రెమ్మలు .
బియ్యము   --  ఒకటిన్నర   గ్లాసుడు .
నూనె   ---  75  గ్రాములు .

పోపుకు .

ఎండుమిరపకాయలు   --  పది
పచ్చి శనగపప్పు   --  మూడు స్పూన్లు
మినపప్పు   --  రెండు  స్పూన్లు
ఆవాలు  --  స్పూను
పల్లీలు  ---  పులుసు  గరిటెడు
ఇంగువ  --  పావు  స్పూను .
నూనె  ---   50  గ్రాములు.

తయారీ  విధానము .

ముందుగా  గిన్నెలో  గ్లాసున్నర  బియ్యము   సరిపడా  నీళ్ళు పోసి  స్టౌ  మీద  పెట్టుకొని పొడిగా  వండుకోవాలి  .

అన్నం  ఉడికే  లోపున

స్టౌ  మీద  బాండి  పెట్టి  ఓ 50 గ్రాముల  నూనె  వేసి  , నూనె  బాగా  కాగగానే   వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి  శనగపప్పు , మినపప్పు , ఆవాలు , ఇంగువ, పచ్చిమిరపకాయలు , కరివేపాకు  మరియు వేరుశనగ  గుళ్ళు వేసి  పోపు బాగా వేయించుకోవాలి.

వేగుతున్నప్పుడే     చింతపండు రసము , తగినంత  ఉప్పు మరియు కొద్దిగా  పసుపు వేసి బాగా  ఉడకనివ్వాలి .

తర్వాత  బేసిన్  లో  ఉడికిన  అన్నం  , స్పూను  పసుపు , కరివేపాకు , అర గరిటెడు  నూనె , కొద్దిగా   ఉప్పు  మరియు  ముందుగా  సిద్ధం  చేసుకున్న పోపు లో ఉడికిన చింతపండు  రసము  అన్నములో   వేసి  గరిటతో అన్నం  అంతా   పొడి  పొడిగా   కలుపు కోవాలి .

చివరగా ముందుగా  సిద్ధంగా  ఉంచుకున్న  నువ్వుపప్పు  పొడి కూడా వేసుకుని  బాగా కలుపుకోవాలి .

అంతే  చింతపండుతో నువ్వుల పొడి  , ఇంగువ  సువాసనలతో  నోరూరించే  పులిహోర  మీకు  సర్వింగ్   కు  సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి