Saturday, January 6, 2018

బంగాళాదుంపల పెరుగు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

బంగాళాదుంపలతో పెరుగు పచ్చడి .

తయారీ విధానము.

పావు కిలో బంగాళాదుంపలు తొక్కుతో ముక్కలుగా తరిగి  కుక్కర్ లో మూడు విజిల్స్  వచ్చే వరకు ఉడికించి  పై తొక్కు తీసుకొని  ముక్కలుగా చేసుకోవాలి .

ఒక చిన్న కట్ట కొత్తిమీర , నాలుగు పచ్చిమిరపకాయలు , చిన్న అల్లం  ముక్క, తగినంత  ఉప్పు వేసి  మిక్సీ లో మరీ మెత్తగా  కాకుండా వేసుకోవాలి .

అర లీటరు  పెరుగు ఒక గిన్నెలో  పోసి బాగా  గరిటతో కలుపుకుని , అందులో ఉడికించిన బంగాళాదుంప  ముక్కలు , మిక్సీ  వేసుకున్న కొత్తిమీర , పచ్చిమిర్చి  మిశ్రమం  వేసుకుని  గరిటతో  బాగా కలుపుకోవాలి.

స్టౌ మీద పోపు గరిటె  పెట్టుకుని  మూడు స్పూన్లు  నెయ్యి  వేసుకుని  రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసుకుని , స్పూను  చాయమినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ మరియు  రెండు రెబ్బలు కరివేపాకు  వేసుకుని  పోపు వేగగానే  ఈ పెరుగు పచ్చడిలో వేసుకుని  గరిటతో బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంపలతో  పెరుగు పచ్చడి  రోటీలు , చపాతీలు మరియు భోజనము లోకి  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి