Saturday, January 6, 2018

వంకాయ కాల్చి పెరుగు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

వంకాయ కాల్చి పెరుగు పచ్చడి .

తయారీ విధానము .

మూడు గుండ్రని వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకుని  వాటిపై నూనె రాసుకుని  స్టౌ మీద సిమ్ సెగలో అన్ని వైపులా కాల్చుకోవాలి .

చల్లారగానే  తడి చేయి చేసుకుని వాటిపై పొట్టు తీసుకుని వేరే ప్లేటులో విడిగా  ఉంచుకోవాలి .

ఒక గిన్నెలో  అర లీటరు పెరుగు వేసుకుని  నాలుగు పచ్చి మిరపకాయలు  ముక్కలుగా తరిగి  పెరుగులో వేసుకోవాలి .

ఒక కట్ట కొత్తిమీర  తరుగుకుని అందులో వేసుకోవాలి .

కొద్దిగా  పసుపు మరియు సరిపడా ఉప్పు పెరుగులో వేసుకోవాలి .

ఇప్పుడు కాల్చి తొక్కు తీసి విడిగా  ఉంచుకున్న  వంకాయలు కూడా వేసుకుని  చేతితో పెరుగులో బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని మూడు స్పూన్లు  నెయ్యి వేసుకుని , నెయ్యి బాగా కాగగానే  మూడు ఎండుమిర్చి  ముక్కలుగా చేసుకుని , స్పూను  మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా  ఇంగువ మరియు కరివేపాకు  వేసి  పోపు పెట్టుకుని గరిటతో బాగా కలుపుకోవాలి ,

అంతే ఎంతో రుచిగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి భోజనము  లోకి సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి