Monday, September 3, 2018

కందిపొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కందిపొడి .

కావలసినవి.

కందిపప్పు  --  100 గ్రాములు.
మినపగుళ్ళు /
లేదా చాయమినపప్పు  - 50 గ్రాములు.
ఎండుమిరపకాయలు  --  15
జీలకర్ర  --  స్పూను
ఇంగువ పొడి   --  పావు స్పూను లో సగం.
ఉప్పు  -- తగినంత

తయారీ విధానము.

స్టౌ మీద  బాండీ పెట్టి  ముందుగా  కందిపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర  బాండీ  లో నూనె వేయకుండా  కమ్మని  వేగిన  వాసన వచ్చే వరకు  వేయించుకోవాలి.

వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి .

తర్వాత  మినపగుళ్ళు  కాని , చాయమినపప్పు  కాని  బాండిలో  వేసుకుని కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .

విడిగా  వేరే పళ్ళెంలో  తీసుకోవాలి .

విడిగా  వేయించు కోవడం  ఎందుకు  అంటే  రెండూ  కలిపి  వేయిస్తే  ఒకటి వేగి  మరొకటి  వేగనట్లు అయితే  పొడి  రుచి పాడవుతుంది.

రెండూ చల్లారిన తర్వాత ఇప్పుడూ  మిక్సీలో  మొదట వేయించినవి మరియు రెండవ సారి వేయించినవి రెండూ వేసుకుని  తగినంత  ఉప్పు  మరియు  ఇంగువ వేసుకుని   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  మొత్తము పొడి  ఒక ప్లేటులో వేసుకుని  చేతితో బాగా  కలుపుకోవాలి .

తర్వాత వేరే సీసా లో కి తీసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే కందిపొడి  సర్వింగ్ కు సిద్ధం.

గోదావరి ప్రాంతం వారు ఈ పొడి వేడి వేడి అన్నంలో కలుపుకుని , గానుగ దగ్గర  పట్టించుకున్న కమ్మని  నువ్వుపప్పు నూనె వేసుకుని  తింటారు.

అద్భుతమైన  రుచిగా ఉంటుంది .

ఈ పొడి  భోజనము లోకే  కాకుండా  ఇడ్లీ  మరియు  దోశెల లోకి కూడా చాలా రుచిగా  ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి