Monday, February 5, 2018

బొబ్బట్లు

ఆలూరుకృష్ణప్రసాదు .

సంక్రాంతి స్పెషల్  వంటకం.

బొబ్బట్లు.

కావలసినవి .

మైదాపిండి  --  ఒక కప్పు.
నూనె  --  2  స్పూన్లు
ఉప్పు   --  చిటికెడు .
నెయ్యి  --  ఒక కప్పు
యాలకులపొడి  --  స్పూను

బొబ్బట్లు లోపల  Stuff  చేసుకోవడానికి .

పచ్చి శనగపప్పు  -  ఒక కప్పు
బెల్లం  -- అర కప్పు

తయారీ  విధానము .

ముందుగా  మైదాపిండి లో  చిటికెడు  ఉప్పు వేసి  స్పూను  నూనె వేసి పొడి పిండి  బాగా కలుపుకోవాలి .

తర్వాత  ఆ పిండిలో  కొద్ది కొద్దిగా  నీరు  పోసుకుంటూ  పిండిని  చపాతీ పిండి మాదిరిగా  కలుపుకోవాలి .

తర్వాత ఆ పిండిలో  మరో స్పూను నూనె వేసుకుని  పిండిని  మరింత మృదువుగా  మెదాయించుకోవాలి .

దానిపై  ఒక పలుచని  గుడ్డను  కప్పి  ఒక ముప్పావు గంట సేపు పక్కన  పిండి  మరింత మృదువుగా  అవ్వటానికి విడిగా ఉంచుకోవాలి .

తర్వాత  పచ్చి శనగపప్పు  ఒకసారి కడిగి  ఒక గిన్నెలో  వేసుకుని  తగినన్ని నీళ్ళు  పోసి  కుక్కర్ లో పెట్టుకుని  మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి .

బెల్లం  పొడి చేసుకుని ఉంచుకోవాలి .

మిక్సీ లో ఉడికిన పచ్చి శనగపప్పు , బెల్లం  పొడి , యాలకుల పొడి వేసుకుని  మెత్తగా  వేసుకోవాలి .

ఆ తర్వాత ఒక అరిటాకును  తీసుకుని  దానిపైన నూనె రాసుకుని  ఉంచుకోవాలి .

మైదాపిండిని  నిమ్మకాయంత  తీసుకొని  పూరీ మాదిరిగా  చేతితో వత్తుకుని  అందులో పూర్ణం పిండిని  పెట్టుకుని  చేతితో  మూసి వేసుకోవాలి .

దానిని  నూనె రాసిన అరటి ఆకులో పెట్టి  నూనె చేతితోనే  పూరీల లాగా  వత్తుకుని ,
స్టౌ మీద పెనం పెట్టుకుని  పెనం మీద   నెయ్యి  వేసుకుని వత్తిన  బొబ్బట్లను  ఆకుతో సహా  బోర్లించాలి .
రెండు వైపులా  కొద్ది  కొద్దిగా  నెయ్యి  వేసుకుంటూమాడకుండా  కాల్చుకోవాలి .

ఇదే విధముగా  ప్రతి బొబ్బట్లు చేసుకోవాలి  .

అంతే ఎంతో రుచిగా  ఉండే  సంక్రాంతి  స్పెషల్  బొబ్బట్లు  సర్వింగ్  కు సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి