Sunday, December 10, 2017

పండుమిరపకాయలతో ఊరగాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

పండుమిరపకాయలతో ఊరగాయ.

తయారీ విధానము .

పండు మిరపకాయలు  - 15
శుభ్రంగా తడి గుడ్డతో  తుడుచుకుని , దాని పై తొడిమలు  తీసి వేసి  ఒక అరగంట సేపు  ఆర పెట్టుకోవాలి .

వాటి మధ్యలో గాటు పెట్టుకుని  పూర్తిగా  గింజలను  తొలగించి , ఆ గింజలను  వేరేగా  ప్లేటులో  తీసుకోవాలి .

రెండు స్పూన్లు  ఆవాలు , రెండు స్పూన్లు  మెంతులు , రెండు  స్పూన్లు  సోంపు  తీసుకుని  బాండీలో  నూనె లేకుండా  దోరగా  వేయించుకోవాలి .

ఆ తర్వాత  మిక్సీ లో మెత్తగా  వేసుకోవాలి .

ఒక  ప్లేటులో  ఈ పొడిని , విడిగా  తీసి ఉంచుకున్న  గింజలను , స్పూను పసుపు , స్పూనున్నర  ఉప్పు ,ఆరు స్పూన్లు  నూనె వేసి  చేత్తో  బాగా  కలుపుకోవాలి .

అందులో రెండు కాయల   నిమ్మరసం  పిండుకుని పండు  మిరపకాయలలో  కూరుకోవాలి .

మరుసటి  రోజు  భోజనము లో  ఊరగాయగా వాడుకోవచ్చును .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి