Thursday, October 12, 2017

శాకాన్నం

ఆలూరుకృష్ణప్రసాదు .

శాకాన్నం .

దేవీ నవరాత్రులలో  అమ్మ వారి   ఆరవ రోజు  అలంకారం   శ్రీ సరస్వతీ  దేవి .

సరస్వతీ  దేవి  నైవేద్యానికి  శాకాన్నం ను  తొమ్మిది  రకముల  కూరగాయలు  మరియు  ఐదు  రకముల  సుగంధ  దినుసులతో  కలిపి  తయారు  చేస్తారు .

ఈ శాకాన్నం తయారీకి  కావలసిన కూరగాయలు .

దొండకాయలు  -- 150    గ్రాములు
బీన్స్  --  100  గ్రాములు
క్యారెట్  --  రెండు
బంగాళాదుంపలు  --  రెండు
పచ్చి బఠాణి   --  50  గ్రాములు
పెద్ద  చిక్కుడు  కాయలు --  100  గ్రాములు
కాప్సికం  --  రెండు
చామదుంపలు  --  150 గ్రాములు
పచ్చిమిరపకాయలు  --  పది

కావలసిన  సుగంథ  ద్రవ్యములు.

యాలకులు  --  8
జాజికాయ  -- కొద్దిగా
జాపత్రి  --  కొద్దిగా
దాల్చిన  చెక్క --  చిన్న ముక్క
లవంగాలు  --  12

నెయ్యి  --  75  గ్రాములు.
జీడిపప్పు  --  30  గ్రాములు .
బియ్యము   --  300  గ్రాములు .

తయారు  చేయు  విధానము .

ముందుగా  పైన తెలిపిన  కూరలు అన్నీ  శుభ్రముగా  కడిగి  బంగాళాదుంప  , చామ దుంప  పై  చెక్కును  తీసుకుని , అన్ని కూరలు  చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి .

బియ్యము  ఒక  గిన్నెలో  పోసి తగినన్ని  నీరు  పోసి  ఒక అరగంట  సేపు  నానబెట్టుకోవాలి.

స్టౌ  మీద  బాండీ  పెట్టుకుని  మూడు స్పూన్లు  నెయ్యి వేసి  ముందుగా  జీడిపప్పు  వేయించుకుని  పక్కన  పెట్టుకోవాలి.

అదే నెయ్యిలో  సుగంథ ద్రవ్య  దినుసులన్నీ  వేయించుకుని  చల్లారగానే  రోటిలో కాని , అమాన్ దస్తాలో  కాని   మెత్తగా  పొడి  చేసుకుని  విడిగా  ఉంచుకోవాలి .

కడిగి  గిన్నెలో  సిద్ధంగా  ఉన్న బియ్యము  లో  నీళ్ళు  సరి  చూసుకుని , తరిగిన  కూరలన్నీ గిన్నెలో   వేసి , కుక్కర్  మూత  మరియు విజిల్  పెట్టి , స్టౌ  మీద  మూడు  విజిల్స్  వచ్చే వరకు ఉడికించి  స్టౌ ను ఆపేయాలి .

విజిల్  ఊడి  రాగానే  వేడి  వేడి  కూరగాయల అన్నాన్ని  బేసిన్  లోకి  వంపుకొని అందులో  సరిపడ  ఉప్పు , సుగంధ  ద్రవ్య దినుసుల పొడి , వేయించి సిద్ధంగా  ఉంచుకున్న  జీడిపప్పు  మరియు  మిగిలిన  నెయ్యి  వేసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి ,

అంతే  శరవన్నవరాత్రులలో  ఆరవ రోజైన  శ్రీ సరస్వతీ  దేవి   నైవేద్యానికి  శాకాన్నం  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి