Thursday, October 12, 2017

ధనియాల పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

ధనియాల పొడి .

నోరు  అరుచిగా  ఉన్నా , జ్వరపడిన వారికి  పత్యం పెట్టాలన్నా , బాలింతలకు  పథ్యానికి  ఈ  ధనియాల పొడి  ఎక్కువగా  పెడతారు .

జలుబు  కఫం వంటివి  కూడా  హరిస్తుంది .

వేడి  వేడి అన్నంలో నెయ్యి బాగా వేసుకుని  ఈ పొడిని  మొదటి  ఐటమ్  గా  వేసుకుని  తింటే  ఆరోగ్య  రిత్యా  చాలా మంచిది .

కడుపులో  ఇబ్బందిగా  ఉన్నవారికి  , గ్యాస్  ప్రాబ్లమ్స్  ఉన్న వారికి  కూడా ఈ ధనియాల పొడి  వాడటం వలన  ఆ ఇబ్బందులు  తొలగి  పోతాయి .

ధనియాల పొడి  తయారీ  విధానము .

కావలసినవి .

ఎండుమిరపకాయలు  --   15
ధనియాలు  --  75  గ్రాములు
మినపప్పు  --  మూడు  స్పూన్లు
చింతపండు  --  చిన్న నిమ్మకాయంత
కరివేపాకు  --  రెండు రెమ్మలు .
ఉప్పు  --  తగినంత
నూనె  --  మూడు స్పూన్లు .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  గింజలు  లేకుండా  శుభ్రం  చేసుకోవాలి .

ధనియాలు  పుల్లలు  లేకుండా  శుభ్ర పరుచు కోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  మొత్తము  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మినపప్పు  , ధనియాలు , వేసి  వేయించుకుని , తర్వాత కరివేపాకు  కూడా  వేసి  కమ్మని  వేపు  వచ్చే వరకు  వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో   వేయించిన  దినుసులు  , చింతపండు  మరియు  తగినంత  ఉప్పు వేసి మెత్తగా   పొడిగా  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ధనియాల పొడి  సర్వింగ్  కు  సిద్ధం .

ఇందులో  మెంతులు , ఆవాలు , జీలకర్ర  , శనగపప్పు , ఇంగువ  వంటివి  వెయ్యరు .

వెల్లుల్లి  తినే  వారు  కూడా  ఇది  కేవలం  ధనియాల పొడి  కావున  వేసుకోపోవడం  మంచిది .

ఈ  పొడి  భోజనము  లోకే  కాకుండా  ఇడ్లీ , దోశెలలోకి కూడా  బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి