Tuesday, May 12, 2020

పులుసు పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

పులుసు పొడి.

కావలసినవి.

ఎండుమిరపకాయలు  - 15
పచ్చిశనగపప్పు  -  30 గ్రాములు.
చాయ మినపప్పు  - 20 గ్రాములు.
ధనియాలు -  పావు కప్పు
మెంతులు  -  రెండు స్పూన్లు 
ఎండు కొబ్బరి -  అర చిప్ప.
చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి.
ఇంగువ  -  పావు  స్పూను.
నూనె  -  నాలుగు  స్పూన్లు .

తయారీ  విధానము.

స్టౌ  మీద బాండీ పెట్టి  మొత్తము  నూనెను  వేసుకుని , నూనెను  బాగా కాగనివ్వాలి.

నూనె బాగా కాగగానే  వరుసగా  మెంతులు , ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు , 
ఇంగువను  వేసుకుని  కమ్మని  వాసన  వచ్చే వరకు  వేయించుకోవాలి.

పోపు  వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా  పోపులో వేసి  కొబ్బరి  ముక్కలను  దోరగా  వేయించుకోవాలి.

పోపు  చల్లారగానే  మిక్సీ  లో  మెత్తని  పొడిగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  ఈ పొడిని  ఒక  సీసాలోకి  తీసుకోవాలి .

ఈ  పులుసు పొడి , పులుసు లోని  ముక్కలన్నీ బాగా  ఉడికి  పులుసు  బాగా  తెర్లుతున్నప్పుడు  రెండు స్పూన్లు  ఈ పులుసు  పొడిని  పులుసులో వేసుకుని , పులుసును  మరో ఐదు నిముషాలు  తెర్లనిచ్చి  దింపు కోవాలి.

ఈ కొలతలతో పులుసు పొడి కొట్టుకుంటే  పది సార్లకు  పైగా  వస్తుంది. మూడు నెలలు  పైగా  నిల్వ ఉంటుంది .

పొడి కొట్టగానే  సీసా  ఫ్రిజ్ లో పెట్టుకుని , కావలసినప్పుడు  పొడి  ఫ్రిజ్ లో నుండి  తీసుకుని , తిరిగి సీసాను  ఫ్రిజ్ లో పెట్టుకుంటే  ఈ పొడితో పెట్టిన  ముక్కల పులుసు ,   ఫ్రెష్ గా  సువాసనలతో అప్పటికప్పుడు  కొట్టిన పొడితో  పెట్టిన పులుసులా తాజాగా  ఉంటుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో   తయారుచేయు  సమయమున  తీసినది.

ఇది  సాంబారు  పొడి  కాదు. సాంబారు  పొడి తయారీ విధానము  వేరు.

ఇందులో  ఉప్పు  వేయరు.
సరిపడా  ఉప్పును  పులుసులోనే  వేసుకోవాలి.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి