Tuesday, May 12, 2020

పల్లీ పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

పల్లీ పొడి  .  (  వేరుశనగ  పొడి. )

కావలసినవి . 

పల్లీలు  --  150 గ్రాములు .

షాపుల్లో  వేయించిన  పల్లీ  గింజలు  విడిగా  అమ్ముతారు .

ఆ పల్లీలు  తెచ్చుకుని  పై పొట్టు తీసేసుకోవాలి .

ఒక వేళ  దొరకని  పక్షంలో  పచ్చి వేరుశనగ  గుళ్ళు  తెచ్చుకుని , బాండీలో  నూనె  వేయకుండా  వేయించుకోవాలి.

చల్లారగానే  పై పొట్టు  తీసేసు కోవాలి.

ఎండుమిరపకాయలు  - 12 .

పచ్చిశనగపప్పు  -  రెండు స్పూన్లు .

చాయమినపప్పు  -  రెండు స్పూన్లు .

ధనియాలు  -  మూడు  స్పూన్లు .

నువ్వుపప్పు  -  మూడు  స్పూన్లు .

ఎండు కొబ్బరి  ముక్కలు -  పావు కప్పు.

జీలకర్ర  -- స్పూను.  

ఉప్పు  -- తగినంత 

నూనె   -- నాలుగు  స్పూన్లు 

కరివేపాకు  -  ఐదు రెమ్మలు .

తయారీ విధానము .

స్టౌ  మీద  బాండీ పెట్టి  మొత్తము నాలుగు స్పూన్లు  నూనెను  వేసుకుని , నూనె  బాగా కాగగానే వరుసగా పై పొట్టు తీసిన  వేరుశనగ గుళ్ళు ,  పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఎండుమిరపకాయలు , ధనియాలు , జీలకర్ర , నువ్వుపప్పు , ఎండు కొబ్బరి  ముక్కలు మరియు కరివేపాకును  వేసుకుని  కమ్మని  వాసన వచ్చే వరకు వేయించు కోవాలి.

చల్లారగానే మిక్సీ లో వేసుకుని  అందులో  తగినంత  ఉప్పును  వేసి  మెత్తని  పొడిగా  చేసుకోవాలి.

ఈ పొడిని  వేరే  సీసాలో  భద్రపరుచుకోవాలి.

ఈ  పొడి  ఇడ్లీ , దోశేలు, చపాతీలు , భోజనములోకి ,  మరియు  వేపుడు  కూరలలోకి  కూడా  చాలా  రుచిగా  ఉంటుంది .

ఇష్టమైన  వారు  ఎనిమిది  వెల్లుల్లి  రెబ్బలు  పై పొట్టును  తీయకుండా  పొడిలో  వేసుకుని మిక్సీ  వేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన రెసిపీ మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో  తయారు చేయు సమయమున  తీసినది.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి