Friday, April 24, 2020

బాదుషాలు

బాదుషాలు.
ఆలూరుకృష్ణప్రసాదు .

మేమెప్పుడూ బాదుషాలు  ఇంటి వద్ద ప్రయత్నించలేదు.

ఈ రోజు  కొద్ది  మైదా పిండితో  ప్రయత్నించాము. రుచి  బాగానే  కుదిరింది.

తయారీ  విధానము .

ఒక  పావు కిలో మైదా పిండిలో ఒక కప్పు పెరుగును , పావు కప్పు డాల్డాను లేదా  నెయ్యిని మరియు చిటికెడు  సోడా ఉప్పును  వేసి పూరీ పిండిలా కలుపు కోవాలి.

పైన తడి గుడ్డ కప్పి  ఒక గంట సేపు పిండిని  కదపకుండా  ఉంచుకోవాలి.

ఒక గంట తర్వాత  పిండిని బాగా  మెదాయించు కోవాలి,

తర్వాత  గుండ్రంగా  బిళ్ళలు  మాదిరిగా  చేసుకోవాలి.

ఒక గిన్నెలో పావు కిలో పంచదార లో  పంచదార మునిగే  వరకు  నీరు పోసుకుని స్టౌ మీద పెట్టుకుని  తీగ పాకం పట్టుకోవాలి.

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టుకుని  పావు కిలో  రిఫైండ్  ఆయిల్  పోసుకుని  ఆయిల్  బాగా  కాగగానే  బాదుషా బిళ్ళలు ఆయిల్ లో వేసుకుని సన్నని  సెగన  కాసిని కాసిని  బంగారు రంగులో  వేయించుకుని  సిద్ధంగా  ఉన్న పాకంలో వేసుకుని  అయిదు నిముషాలు  ఉంచుకుని అవి తీసుకుని , మిగిలినవి వేసుకుంటూ  ఉండాలి.

అంతే  ఎంతో రుచిగా  ఉండే  బాదుషాలు అల్పాహారానికి  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి