Thursday, March 1, 2018

మసాలా పెసర పుణుకులు

మసాలా పెసర వడలు  లేదా మసాలా పెసర పుణుకులు .

కావలసినవి.

పచ్చ పెసలు  లేదా  మామూలు పెసలు  --  పావు కిలో
పచ్చిమిర్చి  --  12 
అల్లం  --  షుమారు  రెండంగుళాలు ముక్క
పై  చెక్కు తీసుకుని
ముక్కలు గా చేసుకోవాలి .

ఉల్లిపాయలు  --  రెండు . సన్నని  ముక్కలుగా  తరుగు కొవాలి .

కరివేపాకు  --  మూడు రెమ్మలు . సన్నగా  తరుగు కోవాలి .

కొత్తిమీర  --  ఒక కట్ట  సన్నగా  తరుగు కోవాలి .

పొదినా  ఆకు   అరకప్పు  --  సన్నగా  తరుగు కోవాలి .

ఉప్పు  --  తగినంత

నూనె  --  అర కిలో

తయారీ  విధానము .

ముందుగా   పెసలు   సరిపడా  నీళ్ళు  పోసి  నాలుగు  గంటల  సేపు  నానబెట్టు కోవాలి .

ఆ తర్వాత నీళ్ళు  వడకట్టు కోవాలి .

ఇప్పుడు  గ్రైండర్ లో కాని  మిక్సీ లో కాని  నాన బెట్టిన  పెసలు , పచ్చి మిర్చి , అల్లం  ముక్కలు మరియు  సరిపడ ఉప్పు వేసి  తగినన్ని  నీళ్ళు పోసుకుంటూ  గారెల పిండి మాదిరిగా   గట్టిగా  వేసుకుని  ఒక  గిన్నెలోకి తీసుకోవాలి .

ఇప్పుడు  అందులో  సన్నగా  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు , తరిగిన  కరివేపాకు , తరిగిన  కొత్తిమీర  మరియు తరిగిన  పొదినా  వేసుకుని  చేతితో  బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ పెట్టుకుని  మొత్తం  నూనె పోసి  నూనె పొగలు వచ్చే  విధముగా  కాగనివ్వాలి .

తర్వాత  పిండిని  అర చేతితో  అద్దుకుని  వడలు  లాగా వేసుకుని  బంగారు  రంగులో  వేయించుకోవాలి .

లేదా  చిన్న చిన్న పుణుకులు లా  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  మసాలా పెసర వడలు  లేదా  మసాలా పెసర పుణుకులు  మధ్యాహ్నము  అల్పాహారమునకు  సిద్ధం .

ఈ వడలు లేదా పుణుకులు  వేడి వేడి అన్నంలో  నెయ్యి వేసుకుని  నంచుకుని  తినవచ్చు .

చాలా రుచిగా ఉంటాయి .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి