Thursday, March 1, 2018

కొయ్య తోటకూర పప్పు

ఆలూరుకృష్ణప్రసాదు .

కొయ్య తోటకూర  పప్పు .

కావలసినవి .

కొయ్య తోటకూర  --

మా వైపు కట్టలు గా  అమ్మరు .
విడిగా  5  రూపాయలకు , 10  రూపాయలకు  అమ్ముతారు . 

ఆ తోటకూర  తెచ్చుకుని  ముదురు కాడలు  తీసి , లేత కాడలు  మరియు ఆకు  తరుగు కోవాలి .

ఈ తరిగిన  ఆకు  షుమారు  పావు కిలో  పప్పుకు  సరిపోతుంది .

కందిపప్పు  --  గ్లాసు లేదా షుమారు  150  గ్రాములు.

చింతపండు -- నిమ్మకాయంత . విడదీసి  పది నిముషాలు  సేపు  తడిపి  ఉంచుకోవాలి .
ఉల్లిపాయలు -- రెండు .
పచ్చిమిరపకాయలు  --   8
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు
ఉప్పు  --  తగినంత
పసుపు  --  పావు  స్పూను

పోపుకు .

ఎండుమిరపకాయలు  4  ముక్కలుగా  చేసుకోవాలి .

ఈ  కొయ్య  తోటకూర  పప్పుకు  నేతితో  పోపు  వేసుకుంటే   రుచిగా  ఉంటుంది .
నెయ్యి   --  3  స్పూన్లు

మెంతులు  --  పావు  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ  విధానము .

ఉల్లిపాయలు ముక్కలుగా తరుగు కోవాలి .

పచ్చిమిరపకాయలు నిలువుగా  తరుగుకోవాలి .

తర్వాత  ఒక వెడల్పాటి  గిన్నెలో  కందిపప్పు  వేసుకుని , ఒకసారి  పప్పును  కడిగి  సరిపడా  నీళ్ళు పోయాలి .

స్టౌ  మీద  పెట్టుకుని  పప్పును  పొంగకుండా  చూసుకుంటూ మూతపెట్టి  పప్పును మూడు  వంతులు పైన  మెత్తగా  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత  తరిగిన   కొయ్య తోటకూర  , తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు , తడిపిన చింతపండు , పసుపు , కొద్దిగా  పచ్చి ఇంగువ , రెండు  రెమ్మలు   కరివేపాకు , తరిగిన   పచ్చిమిర్చి వేసి  నీళ్ళు  అవసరమైతే  కొద్దిగా  పోసుకుని  మూతపెట్టి   పప్పును  పూర్తిగా   ఉడకనివ్వాలి .

ఆ పైన తగినంత  ఉప్పు మరియు స్పూను  ఎండు కారము  వేసి మరో  అయిదు  నిముషాలు  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత  పప్పుని గరిటతో  బాగా  కలుపుకోవాలి .

తర్వాత  స్టౌ  మీద  పోపు  గరిటె  పెట్టుకుని  మొత్తము  నెయ్యి   వేసుకుని  నెయ్యి  బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు  , కొద్దిగా  ఇంగువ  మరియు  కరివేపాకు  వేసుకుని  పోపు  పెట్టుకుని , పప్పులో  వేసుకుని  గరిటెతో బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  కొయ్య తోటకూర  పప్పు సర్వింగ్ కు  సిద్ధం .

ఈ  కొయ్య తోటకూర   పప్పు   భోజనము లోకి , చపాతీలు , రోటీలలోకి  కూడా   చాలా  రుచిగా  ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి