Wednesday, June 7, 2017

చిమ్మిరి ఉండలు .

చిమ్మిరి  ఉండలు .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

image courtesy: google

కావలసిన  పదార్ధములు.

వేయించిన  శనగపప్పు  --   50  గ్రాములు
నువ్వు పప్పు   తెల్లనిది  ----   100  గ్రాములు
బెల్లం  --   100  గ్రాములు
ఎండు కొబ్బరి  --   ఒకచిప్ప.

తయారీ  విధానము .

ముందుగా  ఎండు కొబ్బరి  చిన్న చిన్న  ముక్కలుగా  కట్ చేసుకోవాలి.

బెల్లం  పొడిలా  దంచుకోవాలి . ముక్కలుగా  మిక్సీలో  వేస్తే  మిక్సీ  బ్లేడ్స్  విరగవచ్చు.

నువ్వు పప్పు  వేయించ నవసరం  లేదు .

ఇప్పుడు  మిక్సీలో  ముందుగా   ఎండు కొబ్బరి ముక్కలు  వేసుకుని   గ్రైండ్  చేయాలి .

ఆ తర్వాత  తెల్ల నువ్వు పప్పు ,  పుట్నాల పప్పు , మిక్సీలో  వేసి  మూడు  మెత్తగా  అయ్యాక  చివరగా  బెల్లం పొడి  కూడా  వేసి  మెత్తగా   మిక్సీ  వేసుకోవాలి .

ఈ  మూడింటి  మిశ్రమం  ఒక ప్లేటులోనికి  తీసుకొని  ఉండలుగా  చేతితో  కట్టుకోవాలి .

అంతే  రుచికరమైన  చిమ్మిరి  ఉండలు  సిద్ధం.

బాగా  నీరసంగా   అన్పించినప్పుడు  ఒకటి  రెండు  ఉండలు తీసుకుంటే  నీరసం  మటు మాయం.


ఎక్కువగా   తింటే  నువ్వులు  వేడి  చేయవచ్చు .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి