Sunday, June 18, 2017

దోసకాయ పచ్చిశనగపప్పు కూర

దోసకాయ పచ్చిశనగపప్పు  కూర.
ఆలూరు కృష్ణ ప్రసాద్

ముందుగా  రెండు  దోసకాయలు  పై  చెక్కు తీసుకొని   ముక్కలుగా  తరుగు  కోవాలి .
పావు కప్పు  పచ్చిశనగపప్పు  , మరియు   తరిగిన   దోసకాయ ముక్కలు ఒక గిన్నెలో  వేసి   ముక్కలు  మునిగే  వరకు  నీళ్ళు పోసి  ముక్కలు  మరియు  శనగపప్పు   మెత్త పడేవరకు  ఉడకనివ్వాలి .
ఉప్పు  వేయకుండా  ఉడకనివ్వాలి
ఉడకగానే  నీళ్ళు  వడ కట్టుకుని  ముక్కలపై  కొద్దిగా   పసుపు  వేసుకోవాలి .
పది  పచ్చిమిరపకాయలు   తొడిమలు  తీసి  నిలువుగా  తరుగు కోవాలి .
కరివేపాకు  మూడు రెమ్మలు  సిద్ధంగా  ఉంచుకోవాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  నాలుగు   స్పూన్లు  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  నాలుగు   ఎండు మిర్చి  ముక్కలుగా  చేసినవి , స్పూను  మినపప్పు  , పావు  స్పూను   జీలకర్ర  , అర స్పూను  ఆవాలు , కొద్దిగా   ఇంగువ  వేసి  పోపు  వేసుకోవాలి .
పోపు వేగగానే  తరిగిన   పచ్చిమిర్చి   ముక్కలు,  కరివేపాకు  కూడా  వేసి   వేగ నివ్వాలి .
తర్వాత  ఉడికిన  దోసకాయ  శనగపప్పు   మిశ్రమం  కూడా  వేసి , తగినంత  ఉప్పువేసి  ఒక  అయిదు  నిముషాలు   మూత పెట్టి  మగ్గ నివ్వాలి .
తర్వాత  దింపుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .
పచ్చి  మిర్చి  సరిపడా  వేసాము  కనుక  వేరుగా  ఎండు  కారం  వేయనవసరం  లేదు .
చూసి  అవసరమైతే  వేసుకోండి .
దోసకాయలో  పులుపు  ఉంటుంది  కనుక  చింతపండు   రసం  కూడా  వేయనవసరం  లేదు .
మీకు  ఇష్ట మైతే  వేసుకోండి .
అంతే  ఎంతో  రుచికరమైన   దోసకాయ పచ్చిశనగపప్పు కూర  అన్నం  లోకి  రోటి ల లోకి  సర్వింగ్ కు  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి